షమీపై ట్రోలింగ్.. పాపం ఎవరిది? సాక్ష్యాలు ఇదిగో..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది. షమీ పాకిస్థాన్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించాడని, అతడు ఐఎస్ఐ ఏజెంట్ అని విమర్శలు చేశారు.
Read Also: మోకాలుపై కూర్చోకపోవడానికి కారణాలు చెప్పిన డికాక్
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
- IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
ఈ విషయంలో బీసీసీఐ, భారత క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలిచారు. జట్టుగా భారత్ ఓడిపోతే షమీ ఒక్కడినే నిందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా తెలిసిందేంటంటే.. షమీపై ట్రోలింగ్ పాకిస్థాన్ అభిమానుల నుంచే మొదలైంది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన స్క్రీన్ షాట్లు కూడా దొరికాయి. కౌంటర్ ప్రాపగండా అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఇవి బయటపడ్డాయి. కొంతమంది ఇడియట్స్ చేసిన పని ఇదని కౌంటర్ ప్రాపగండా డివిజన్ ట్వీట్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా కీలకమైనదని.. ఉద్వేగాలు ముడిపడి ఉంటాయని తెలిసినందున మ్యాచ్ పూర్తయిన వెంటనే కావాలనే కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విమర్శలు చేశారని అందులో పేర్కొంది. షమీపై ట్రోలింగ్ చేసిన వారి ఖాతాలను పరిశీలించగా పలు ఖాతాల్లో సరైన వివరాలు లేవని.. వివరాలు ఉన్న ఖాతాల్లో చాలావరకు పాకిస్థాన్ నుంచే పోస్టులు ఉన్నాయని కౌంటర్ ప్రాపగండా తెలిపింది.

తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!