India vs Pakistan: “అలా జరిగితే పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడ్డట్లే”.. ఈ రోజు మ్యాచ్పై అక్తర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. శ్రీలంక క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో ఈ రోజు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఇరు జట్ల అభిమానులతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచులో పసికూన నేపాల్ పై 238 పరుగుల తేడాతో గెలిచి ఊపులో ఉంది. కాగా భారత్ కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్.
ప్రతిష్టాత్మకంగా మారిన ఈ మ్యాచుపై ఇరు జట్లకు చెందిన మాజీ స్టార్ ఆటగాళ్లు తమ అంచనా వేస్తున్నారు. పాక్ స్పీడ్ స్టార్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుదే పై చేయిగా ఉంటుందని తేల్చేశారు. ముందుగా భారత్ బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడ్డట్టే అని అన్నారు. ఇదే విధంగా పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ కి దిగితే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని అన్నారు.
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
Read Also: Singapore Presidential Election: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం ఎన్నిక
బాబర్, అతని టీం చాలా పరిణితి క్రికెట్ ఆడుతున్నారని, వారు ఇంతకు ముందు భారత్ తో ఒత్తడితో కూడిన మ్యాచులు ఆడారని, ఇప్పుడు వారిపై పెద్దగా ఒత్తిడి ఉండదని అక్తర్ చెప్పుకొచ్చారు. ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంటే భారత్ ని చిత్తు చేస్తుందని అంచనా వేశాడు. భారత్ టాస్ గెలిస్తే పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడితే ఫ్లడ్ లైట్ల వెలుగులో బాల్ ఎక్కువగా కదలకపోవడంతో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడొచ్చని షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో అన్నారు.
బూమ్రా, షమీ, సిరాజ్ ముగ్గురు ఫేసర్లతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండాలని అన్నారు. రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయిని అన్నారు. విరాట్ కోహ్లీ 3 లేదా 4 వద్ద బ్యాటింగ్ చేయాలా, మరియు ఇషాన్ 5 వద్ద బ్యాటింగ్ చేయాలా లేదా ఇన్నింగ్స్ ప్రారంభించాలా అనే దానిపై చర్చ జరుగుతోందని, అయితే పాక్ పేస్ దళం బలంగా ఉందని, వారి బ్యాటింగ్ కూడా గతంలో కన్నా బలంగా ఉందని అన్నారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!