Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!
- టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ
- మరోసారి హాట్ టాపిక్గా మారిన కెప్టెన్సీ అంశం
- నక్వీ కారణంగానే పాకిస్థాన్ ఓటములు
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై విజయం సాధించినా.. మెరుగైన రన్రేట్ లేకపోవడంతో పాక్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గత నాలుగు టీ20 వరల్డ్ కప్ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బాబర్ అజమ్ కెప్టెన్గా ఉన్నప్పుడు పాక్ స్థిరమైన ప్రదర్శన చేయగా.. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో దారుణ ప్రదర్శన చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పుకు కారణమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీపై పాక్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాక్ ఓటములను ఎదుర్కొంటోందని కామెంట్స్ చేస్తున్నారు.
బాబర్ అజమ్ నాయకత్వంలో పాకిస్థాన్ 2021 టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఓడిపోయినా.. జట్టు ప్రదర్శన బాగుంది. 2022లో అయితే ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఓటమి పాలైనా.. వరుసగా రెండు వరల్డ్ కప్ల్లో నాకౌట్ దశకు చేరడం బాబర్ కెప్టెన్సీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే 2024 వరల్డ్ కప్లో భారత్, అమెరికా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం బాబర్ కెరీర్లో మచ్చగా మిగిలింది.
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
ఇక 2026 టీ20 వరల్డ్ కప్లో పాక్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో బరిలోకి దిగింది. లీగ్ దశలో టీమిండియాపై ఓటమిని ఎదుర్కొంది. సూపర్-8 దశకు చేరినా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పోరాటం జట్టుకు కఠిన సవాలుగా మారింది. ఫలితంగా పాక్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో పాక్ ప్రదర్శనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబర్ అజమ్ హయాంలో పాక్ వరుసగా సెమీస్, ఫైనల్ చేరిందని… అయినా ఎందుకు కెప్టెన్సీ మార్పు చేశారన్న చర్చ మొదలైంది. సల్మాన్ ఆఘాను కెప్టెన్గా కొనసాగించడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!