Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
- పదవీ విరమణ రోజే సీబీఐ షాక్
- ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు
- రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం అరెస్టు చేసింది. ఇదే కేసులో ఇద్దరు బ్యాంకు అధికారులను కూడా అదుపులోకి తీసుకుంది.
రూ.169 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణ
సీబీఐ దర్యాప్తు ప్రకారం, హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (HSPCB) సభ్య కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రదీప్ కుమార్ ప్రభుత్వానికి చెందిన రూ.169 కోట్ల నిధుల దుర్వినియోగంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు మొత్తం రూ.504 కోట్ల ఆర్థిక కుంభకోణంతో సంబంధం కలిగి ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతో నిధుల మళ్లింపు
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కాలుష్య నియంత్రణ మండలి నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పేరుతో చండీగఢ్లోని ఒక బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే ఆ నిధులతో ఎలాంటి ఎఫ్డీలు సృష్టించకుండానే మోసపూరిత డెబిట్ లావాదేవీల ద్వారా డబ్బును పక్కదారి పట్టించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఘటనతో హర్యానా ప్రభుత్వానికి సుమారు రూ.169 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపిస్తోంది.
దర్యాప్తుకు సహకరించలేదని ఆరోపణ
ప్రదీప్ కుమార్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని సీబీఐ తెలిపింది. దీంతో ఆయన ఆచూకీ గుర్తించి పదవీ విరమణ రోజునే అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీ విధానం, ఈ కుంభకోణంలో ఇతరుల పాత్రపై సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.
ఇద్దరు బ్యాంకు అధికారుల అరెస్టు
ఈ కేసులో భాగంగా IDFC First Bank అప్పటి ఏరియా హెడ్ షమీమ్ దార్, AU Small Finance Bank మొహాలీ శాఖ అప్పటి బ్రాంచ్ మేనేజర్ చరణ్జిత్ సింగ్ రంధావాలను కూడా సీబీఐ అరెస్టు చేసింది. నకిలీ ఎఫ్డీలు, అక్రమ లావాదేవీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించడంలో వీరి పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
ఇప్పటికే పలువురిపై ఛార్జిషీట్లు
ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు సీబీఐ 17 మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీరిలో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు ఉన్నారు. హర్యానా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ కేసును రాష్ట్ర విజిలెన్స్ శాఖ నుంచి సీబీఐకి బదిలీ చేశారు.
- Tags
- CBI
- Haryana
- Pradeep Kumar IAS
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!