Sunil Gavaskar: జట్టులో మార్పులు వద్దు.. ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు!
- దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- టీమిండియాకు పలు సూచనలు చేసిన సునీల్ గవాస్కర్..
- ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు: గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ ఫైనల్ మ్యా్చ్ లో న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది భారత్. ఇక, తుది జట్టు ఎలా ఉండబోతుందని అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదన్నారు. గత రెండు మ్యాచుల్లో బరిలోకి దిగినట్లే నలుగురు స్పిన్నర్లు, ఇద్దర్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. కానీ, కొన్ని అంశాల్లో రోహిత్ సేన మెరుగైతే ఫైనల్లో తిరుగుండదన్నాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు ఓపెనర్ల నుంచి భారీ ఆరంభం రాలేదన్నాడు.. ఫైనల్లో వస్తుందని అనుకుంటున్నాను.. ఈ విషయంలో ఓపెనర్లు మెరుగవ్వాల్సి ఉంది.. ఇక, కొత్త బంతితోనూ ఆరంభంలో ఇంకొన్ని వికెట్లు తీసుకోవాలి.. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది.. దీంతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపుతున్నప్పటికీ వికెట్లు పడగొడితే ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
Read Also: Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఇక, టీమిండియా రెండు విభాగాల్లో ఇంప్రూవ్ కావాలి అని సునీల్ గవాస్కర్ సూచించారు. అప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మనకు ఈజీ అవుతుందన్నాడు. భారత్ తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండటంతో బౌలింగ్ ప్రభావవంతంగా మారిందన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లను తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం అన్నారు. వికెట్లు తీయడమే కాకుండా.. డాట్ బాల్స్ను వేయడం పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత కీలకం అన్నారు. వారిద్దరూ ఆ విషయంలో చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే న్యూజిలాండ్ పై స్పిన్నర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు.. దుబాయ్ పిచ్ నుంచి మంచి స్పిన్నర్లకు సహకారం అందుతోంది. అలాంటప్పుడు భారత్ ఫైనల్ XIలో ఎలాంటి మార్పులు చేయకుండానే రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!