Sunil Gavaskar: జట్టులో మార్పులు వద్దు.. ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు!
- దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- టీమిండియాకు పలు సూచనలు చేసిన సునీల్ గవాస్కర్..
- ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు: గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ ఫైనల్ మ్యా్చ్ లో న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది భారత్. ఇక, తుది జట్టు ఎలా ఉండబోతుందని అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదన్నారు. గత రెండు మ్యాచుల్లో బరిలోకి దిగినట్లే నలుగురు స్పిన్నర్లు, ఇద్దర్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. కానీ, కొన్ని అంశాల్లో రోహిత్ సేన మెరుగైతే ఫైనల్లో తిరుగుండదన్నాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు ఓపెనర్ల నుంచి భారీ ఆరంభం రాలేదన్నాడు.. ఫైనల్లో వస్తుందని అనుకుంటున్నాను.. ఈ విషయంలో ఓపెనర్లు మెరుగవ్వాల్సి ఉంది.. ఇక, కొత్త బంతితోనూ ఆరంభంలో ఇంకొన్ని వికెట్లు తీసుకోవాలి.. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది.. దీంతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపుతున్నప్పటికీ వికెట్లు పడగొడితే ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
Read Also: Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ఇక, టీమిండియా రెండు విభాగాల్లో ఇంప్రూవ్ కావాలి అని సునీల్ గవాస్కర్ సూచించారు. అప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మనకు ఈజీ అవుతుందన్నాడు. భారత్ తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండటంతో బౌలింగ్ ప్రభావవంతంగా మారిందన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లను తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం అన్నారు. వికెట్లు తీయడమే కాకుండా.. డాట్ బాల్స్ను వేయడం పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత కీలకం అన్నారు. వారిద్దరూ ఆ విషయంలో చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే న్యూజిలాండ్ పై స్పిన్నర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు.. దుబాయ్ పిచ్ నుంచి మంచి స్పిన్నర్లకు సహకారం అందుతోంది. అలాంటప్పుడు భారత్ ఫైనల్ XIలో ఎలాంటి మార్పులు చేయకుండానే రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!