Sunil Gavaskar: జట్టులో మార్పులు వద్దు.. ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు!
- దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- టీమిండియాకు పలు సూచనలు చేసిన సునీల్ గవాస్కర్..
- ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు: గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ ఫైనల్ మ్యా్చ్ లో న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది భారత్. ఇక, తుది జట్టు ఎలా ఉండబోతుందని అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదన్నారు. గత రెండు మ్యాచుల్లో బరిలోకి దిగినట్లే నలుగురు స్పిన్నర్లు, ఇద్దర్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. కానీ, కొన్ని అంశాల్లో రోహిత్ సేన మెరుగైతే ఫైనల్లో తిరుగుండదన్నాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు ఓపెనర్ల నుంచి భారీ ఆరంభం రాలేదన్నాడు.. ఫైనల్లో వస్తుందని అనుకుంటున్నాను.. ఈ విషయంలో ఓపెనర్లు మెరుగవ్వాల్సి ఉంది.. ఇక, కొత్త బంతితోనూ ఆరంభంలో ఇంకొన్ని వికెట్లు తీసుకోవాలి.. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది.. దీంతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపుతున్నప్పటికీ వికెట్లు పడగొడితే ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
Read Also: Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
ఇక, టీమిండియా రెండు విభాగాల్లో ఇంప్రూవ్ కావాలి అని సునీల్ గవాస్కర్ సూచించారు. అప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మనకు ఈజీ అవుతుందన్నాడు. భారత్ తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండటంతో బౌలింగ్ ప్రభావవంతంగా మారిందన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లను తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం అన్నారు. వికెట్లు తీయడమే కాకుండా.. డాట్ బాల్స్ను వేయడం పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత కీలకం అన్నారు. వారిద్దరూ ఆ విషయంలో చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే న్యూజిలాండ్ పై స్పిన్నర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు.. దుబాయ్ పిచ్ నుంచి మంచి స్పిన్నర్లకు సహకారం అందుతోంది. అలాంటప్పుడు భారత్ ఫైనల్ XIలో ఎలాంటి మార్పులు చేయకుండానే రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!