IPL 2022: రాణించిన కోల్కతా టాపార్డర్.. ముంబై టార్గెట్ 166
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్లోని 56వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా, కోల్కతా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత కోల్కాతా టాపార్డర్ సృష్టించిన విధ్వంసం చూసి.. ముంబై ముందు భారీ లక్ష్యం పెడతారని అంతా అనుకున్నారు.
గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా ఫామ్లో లేని వెంకటేశ్ అయ్యర్, ఈ మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. రహానే (24 బంతుల్లో 25) పెద్దగా ఆడలేదు కానీ, అయ్యర్కి సహాయం అందించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా.. 26 బంతుల్లో 3 ఫోర్సు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టాపార్డర్ అదరగొట్టేయడంతో, కోల్కతా ఈరోజు 200 పరుగుల మార్జిన్ని దాటేస్తుందని భావించారు. కానీ, అందుకు భిన్నంగా వికెట్లు వరుసగా పడ్డాయి. రింకు సింగ్ (19 బంతుల్లో 23) ఒక్కడే నిలకడగా రాణిస్తే, మిగతా వాళ్ళు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు. దీంతో, కోల్కతా స్కోరు 165/9 వద్దే ఆగిపోయింది.
Also Read
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
- IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తన బంతితో మాయ చేయగలిగాడు. 4 ఓవర్లలో ఒకటి మెయిడన్ ఓవర్ వేసి, కేవలం 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. కుమార్ కార్తికేయ కాస్త పరుగులు సమర్పించినా.. (3 ఓవర్లలో 32 పరుగుల) 2 వికెట్లు తీయగలిగాడు. డేనియల్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నాడు. బుమ్రా తిరిగి ఫామ్లోకి రావడం వల్లే, కోల్కతాని 165 పరుగుల వద్దే కట్టడి చేయగలిగారు. మరి, తమ ముందున్న లక్ష్యాన్ని ముంబై చేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!