Champions Trophy 2025: కరుణ్ నాయర్ను కనీసం స్టాండ్బై ప్లేయర్గా తీసుకోవాల్సింది..
- ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన..
- దేశవాళీలో అదరగొట్టిన కరుణ్ నాయర్ను స్టాండ్బై ప్లేయర్గా తీసుకోవాల్సింది..
- మంచిగా ఆడే ప్లేయర్లను పట్టించుకోకపోతే రంజీ మ్యాచ్ల ప్రాముఖ్యత ఏముంటుంది: భజ్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టోర్నీలో పాల్గొంటుంది. ఇక, వైస్ కెప్టెన్గా గిల్కు ఛాన్స్ వచ్చింది. అయితే, దేశవాళీలో అదరగొట్టిన కరుణ్ నాయర్పై బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపించలేదు. కేవలం 8 మ్యాచుల్లో ఐదు సెంచరీలతో 779 రన్స్ చేసిన అతడిని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. 15 మంది స్క్వాడ్లో ఛాన్స్ ఇవ్వకపోయినా.. కనీసం స్టాండ్బై ప్లేయర్ గా తీసుకున్నా బాగుండేదని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also: Karnataka: కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు.. రాష్ట్ర అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్!
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
- Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
- Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు. ఎవర్నీ తీసుకోవాలి.. ఎవర్నీ పక్కన పెట్టాలనేది? నిర్ణయించడం చాలా కష్టమని నేనూ అంగీకరిస్తా అని అతడు పేర్కొన్నాడు. కానీ, కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే క్వశ్చన్ చేసేవాడిని కాదు.. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. కనీసం అలాంటి ఆటగాళ్లకు అదనపు ప్లేయర్స్ లిస్టులో తీసుకోవాల్సిందని హర్భజన్ సింగ్ అన్నాడు.
Read Also: Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!
ఇలా, అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్లేయర్లను ఎంపిక చేయకపోతే.. రంజీ మ్యాచ్ల ప్రాముఖ్యత ఏముంటుంది? అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెటర్ ఎవరైనా ఫామ్లో లేకపోతే జట్టు నుంచి తప్పించి.. దేశవాళీలో ఆడిన తర్వాత ఫామ్లోకి వస్తేనే మళ్లీ టీమ్ లోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వారి ఆటను అస్సలు చూడటం లేదు.. వెంటనే, కరుణ్నాయర్ను స్టాండ్బై ప్లేయర్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించాలని భజ్జీ తెలిపాడు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..