T20 World Cup: భారత్ ఒప్పుకోకపోతే.. అక్టోబర్ 23న పాక్ మ్యాచ్ ఆడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamran Akmal Younis Khan Reacts To Jay Shah Comments On Asia Cup: వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే.. టీమిండియా పాక్కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని, పాక్లో నిర్వహిస్తే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టోర్నీలో పాల్గొనదని ఆయన తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించగా.. తాజాగా పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక న్యూస్ ఛానెల్తో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘‘జై షా ఈ విధమైన ప్రకటన చేస్తారని ఊహించలేదు. చూస్తుంటే.. ఆయన కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించకపోతే.. ఇకపై ఇండియాతో పాక్ ఎప్పుడూ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లలోనూ ఇండియాతో మ్యాచ్ ఆడదు. అసలు ఆసియా కప్ దాకా ఆగాల్సిన అవసరం లేదు.. టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబరు 23న నిర్వహించిన మ్యాచ్లోనూ ఇండియాతో పాక్ ఆడదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్కు రాకూడదనే నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉంటే.. పాక్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ కోసం ఇండియాకు వెళ్లదు’’ అని పేర్కొన్నాడు.
Also Read
- India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
- India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
- ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
ఈ విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాక్ మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలపై మన టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాకిస్తాన్ జట్టేనని.. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని కౌంటర్ ఎటాక్కి దిగారు. కాగా.. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!