Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్కు పెద్ద ఝలక్.. ఆ విధ్వంసకర ఓపెనర్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joss Butler To Miss Upcoming Game Against Delhi Capitals: నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్కు ఆ బాధ నుంచి కోలుకోకముందే ఒక పెద్ద ఝలక్ తగిలింది. ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న మ్యాచ్కు.. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జాస్ బట్లర్ దూరం కానున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ చేతి వేలుకు గాయమైంది. ఈ గాయం కారణంగానే అతడు ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో ఓపెనింగ్కి రాలేదు. అతని స్థానంలో అశ్విన్ వచ్చాడు. అయితే.. వెంటనే తొలి వికెట్ పడటంతో బట్లర్ వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చాడు.
Akshara Singh: హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సిగ్గు లేదా ఇలాంటివి చేయడానికి
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు. అప్పటికీ భారీ షాట్లు బాదేందుకు ప్రయత్నించాడు. 19 పరుగులు చేయగలిగాడు. అయితే.. ఆ గాయం తీవ్రమైతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి, తదుపరి మ్యాచ్లో బట్లర్కు విశ్రాంతి ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు తెలిసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలోనూ.. బట్లర్ పూర్తిగా ఫిట్గా లేడని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా తెలిపాడు. దీన్ని బట్టి.. ఆ గాయం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైన నిర్ణయమని జట్టు యాజమాన్యం భావించింది. బట్లర్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాను జట్టులో తీసుకోనున్నారని సమాచారం.
Shikhar Dhawan: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్గా రికార్డ్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగిపోవడంతో పంజాబ్ కింగ్స్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ సంజూ (42), హెట్మేయర్, జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించారు కానీ, చివరికి వారి ప్రయత్నం విఫలమైంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!