Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్కు పెద్ద ఝలక్.. ఆ విధ్వంసకర ఓపెనర్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joss Butler To Miss Upcoming Game Against Delhi Capitals: నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్కు ఆ బాధ నుంచి కోలుకోకముందే ఒక పెద్ద ఝలక్ తగిలింది. ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న మ్యాచ్కు.. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జాస్ బట్లర్ దూరం కానున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ చేతి వేలుకు గాయమైంది. ఈ గాయం కారణంగానే అతడు ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో ఓపెనింగ్కి రాలేదు. అతని స్థానంలో అశ్విన్ వచ్చాడు. అయితే.. వెంటనే తొలి వికెట్ పడటంతో బట్లర్ వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చాడు.
Akshara Singh: హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సిగ్గు లేదా ఇలాంటివి చేయడానికి
Also Read
- IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
- Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు. అప్పటికీ భారీ షాట్లు బాదేందుకు ప్రయత్నించాడు. 19 పరుగులు చేయగలిగాడు. అయితే.. ఆ గాయం తీవ్రమైతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి, తదుపరి మ్యాచ్లో బట్లర్కు విశ్రాంతి ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు తెలిసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలోనూ.. బట్లర్ పూర్తిగా ఫిట్గా లేడని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా తెలిపాడు. దీన్ని బట్టి.. ఆ గాయం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైన నిర్ణయమని జట్టు యాజమాన్యం భావించింది. బట్లర్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాను జట్టులో తీసుకోనున్నారని సమాచారం.
Shikhar Dhawan: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్గా రికార్డ్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగిపోవడంతో పంజాబ్ కింగ్స్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ సంజూ (42), హెట్మేయర్, జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించారు కానీ, చివరికి వారి ప్రయత్నం విఫలమైంది.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..