Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
- రెండో అర్ధ భాగంలో పంజాబ్ ఊహించని పరాజయాలు
- వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన పరిస్థితి
- ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్
- చాహల్కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదో చెప్పిన శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ జట్టు ఓటమిపాలవడంతో.. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ వ్యూహాలపై నిజాయితీగా స్పందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చేసిన పొరపాట్లు, సరైన ప్లానింగ్ లేకపోవడం జట్టు ఓటమికి కారణమైందని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్పై 210 పరుగులు చాలా ఎక్కువ. బంతి బాగా సీమ్ అవుతోంది. బౌన్స్ కూడా స్థిరంగా లేదు. ఈ పరిస్థితుల్లో 210 అనేది కనీసం 30 పరుగులు ఎక్కువ స్కోరే’ అని తెలిపాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదన్న ప్రశ్నకు అయ్యర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాహల్ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. కానీ పిచ్ సీమర్లకు బాగా సహకరిస్తోంది. మా పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని చెప్పాడు.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
డెత్ ఓవర్లలో యార్కర్లు ఎందుకు ప్రయత్నించలేదని అడగగా.. ‘మేము ఇంకా హార్డ్ లెంగ్త్కే కట్టుబడి ఉన్నాం. కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు షార్ట్ ఆఫ్ హార్డ్ లెంగ్త్ బంతులు వేయడం ఉత్తమం అని నేను నమ్ముతాను. అలాంటి బంతులను వరుసగా వేస్తే.. ఎప్పుడో ఒకసారి మిస్ హిట్ వస్తుంది. అక్కడ వికెట్ దక్కే అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.
అయితే చివరికి తమ వ్యూహాలే విఫలమయ్యాయని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఒప్పుకున్నాడు. ‘మా ప్లానింగ్లో లోపం ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది’ అని పేర్కొన్నాడు. అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం బౌలింగ్ మార్పుల విషయంలో కెప్టెన్సీ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!