Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
- రెండో అర్ధ భాగంలో పంజాబ్ ఊహించని పరాజయాలు
- వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన పరిస్థితి
- ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్
- చాహల్కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదో చెప్పిన శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ జట్టు ఓటమిపాలవడంతో.. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ వ్యూహాలపై నిజాయితీగా స్పందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చేసిన పొరపాట్లు, సరైన ప్లానింగ్ లేకపోవడం జట్టు ఓటమికి కారణమైందని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్పై 210 పరుగులు చాలా ఎక్కువ. బంతి బాగా సీమ్ అవుతోంది. బౌన్స్ కూడా స్థిరంగా లేదు. ఈ పరిస్థితుల్లో 210 అనేది కనీసం 30 పరుగులు ఎక్కువ స్కోరే’ అని తెలిపాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదన్న ప్రశ్నకు అయ్యర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాహల్ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. కానీ పిచ్ సీమర్లకు బాగా సహకరిస్తోంది. మా పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
డెత్ ఓవర్లలో యార్కర్లు ఎందుకు ప్రయత్నించలేదని అడగగా.. ‘మేము ఇంకా హార్డ్ లెంగ్త్కే కట్టుబడి ఉన్నాం. కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు షార్ట్ ఆఫ్ హార్డ్ లెంగ్త్ బంతులు వేయడం ఉత్తమం అని నేను నమ్ముతాను. అలాంటి బంతులను వరుసగా వేస్తే.. ఎప్పుడో ఒకసారి మిస్ హిట్ వస్తుంది. అక్కడ వికెట్ దక్కే అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.
అయితే చివరికి తమ వ్యూహాలే విఫలమయ్యాయని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఒప్పుకున్నాడు. ‘మా ప్లానింగ్లో లోపం ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది’ అని పేర్కొన్నాడు. అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం బౌలింగ్ మార్పుల విషయంలో కెప్టెన్సీ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!