చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్ను మోస్తరు స్కోరుకు పరిమితం చేశారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 19.3 ఓవర్లలో గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Aslo Read: iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా (1), శుభమాన్ గిల్ (2)లను సిరాజ్ ఔట్ చేశాడు. సాయి సుదర్శన్ (6) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ జట్టును ఆదుకున్నారు. మిల్లర్ పెవిలియన్ చేరాక.. రాహుల్ తెవాటియా ధాటిగా ఆడాడు. రషీద్ ఖాన్ కాస్త మెరుపులు మురిపించగా.. విజయ్ శంకర్ నిరాశపరిచాడు. విజయ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడ్డాయి.