RCB-BCCI: ఆర్సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?
- ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ
- ఆడిన మూడు మ్యాచ్లలో ఓడిపోయిన సీఎస్కే
- ఆర్సీబీకి మద్దతుగా బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో షెడ్యూల్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. కొంతమంది అభిమానులు భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) షెడ్యూల్లో అనుమానాలు ఉన్నాయని, ఆర్సీబీకి పరోక్షంగా లాభం చేకూర్చిందని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్లలో గెలవగా.. సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్లలో ఓడిపోయింది.
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ను మార్చి 28న ఆడింది. ఆ తర్వాత 7 రోజుల విరామం లభించింది. ఇది బెంగళూరు జట్టుకు పెద్ద ప్లస్గా మారింది. ఈ విరామం వల్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు గాయాల నుంచి కోలుకోవడానికి కూడా సమయం దొరికింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా జట్టు మొత్తం చిన్నస్వామి మైదానంలో ఉండటంతో ప్రయాణ అలసట కూడా లేకుండా ఫ్రెష్గా బరిలోకి దిగింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
మరోవైపు సీఎస్కే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మార్చి 30న తొలి మ్యాచ్ ఆడిన చెన్నై.. ఏప్రిల్ 3న రెండో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పెద్దగా విరామం లేకుండానే బెంగళూరులో ఏప్రిల్ 5న మూడో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అస్సాంలో, చెన్నైలో మ్యాచ్లు ఆడిన తర్వాత సీఎస్కే ప్లేయర్స్ బెంగళూరుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది జట్టుపై ప్రభావం చూపిందని చెన్నై అభిమానులు అంటున్నారు.
Also Read: Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!
బీసీసీఐపై సోషల్ మీడియాలో సీఎస్కే అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక జట్టుకు పూర్తి విశ్రాంతి, మరొక జట్టుకు వరుస మ్యాచ్లు, ప్రయాణాలు… ఇది సమాన అవకాశమేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ షెడ్యూల్పై పారదర్శకత ఉండాలని, అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. టోర్నమెంట్ నిర్వహణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందిస్తారని, ప్రతి జట్టుకీ ఏదో దశలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఏదైమైనా అభిమానుల మధ్య ఈ చర్చ మరికొన్ని రోజులు కొనసాగడం ఖాయం.
తాజావార్తలు
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!