MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!
- ముగిసిన ధోనీ, రోహిత్ యుగం
- అభిమానుల మదిలో చెరగని ముద్ర
- ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్న చెన్నై, ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై, రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్లుగా చెన్నై, ముంబై నిలిచాయి. ఒకానొక సమయంలో ఈ రెండు టీమ్స్ ప్రత్యర్థులను బెంబేలెత్తించాయి. ఎంతలా అంటే.. మ్యాచ్ మొదలయ్యే ముందే ప్రత్యర్ధులు ఓటమిని ఒప్పుకునేవి. అయితే ఇప్పుడు సారథులుగా ధోనీ, రోహిత్ యుగం ముగిసింది. ఇద్దరు ఇప్పుడు ఆటగాళ్లుగా సేవలందిస్తున్నారు.
ఐపీఎల్ మొదటి సీజన్ 2008లోనే చెన్నై రన్నరప్గా నిలిచింది. 2010లో చెన్నై టైటిల్ గెలవగా.. ఆ సీజన్లో ముంబై రన్నరప్గా నిలిచింది. 2011లో విజేతగా నిలిచిన చెన్నై.. 2012లో రన్నరప్గా నిలిచింది. 2013లో ముంబై టైటిల్ గెలుచుకోగా.. చెన్నై రన్నరప్గా నిలిచింది. 2015లో ముంబై విజేతగా నిలవగా.. చెన్నై మరోసారి రన్నరప్గా నిలిచింది. 2017లో ముంబై ట్రోఫీ సాధించింది. 2018లో చెన్నై టైటిల్ గెలుచుకుంది. 2019లో ముంబై విజేతగా నిలవగా.. చెన్నై రన్నరప్గా ముగిసింది. 2020లో ముంబై ట్రోఫీ గెలుచుకోగా, 2021లో చెన్నై టైటిల్ సాధించింది. 2023లో చెన్నై మరోసారి చాంపియన్గా నిలిచి ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. 2023 అనంతరం చెన్నై, ముంబైల హవా తగ్గిపోయింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
చెన్నై జట్టు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 12 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. ఇందులో 10 ఫైనల్స్ ఆడి.. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది. అంతేకాకుండా 2 చాంపియన్స్ ట్రోఫీలను కూడా ఖాతాలో వేసుకుంది. ముంబై టీమ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో 8 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఇందులో 5 ఫైనల్స్ ఆడి.. 5 టైటిల్స్ గెలుచుకుంది. 2 చాంపియన్స్ ట్రోఫీలు కూడా సాధించింది. ధోనీ, రోహిత్ నాయకత్వంలో చెన్నై, ముంబై జట్లు ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక యుగాన్ని సృష్టించాయి. ఇద్దరి దిగ్గజాల ఆధిపత్యం అభిమానుల మదిలో నిలిచిపోయింది.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!