ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో ముంబై తక్కువ రన్స్ చేసింది. ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. నేహల్ వద్వేరా, టిమ్ డేవిడ్ ఆచితూచి ఆడటంతో ఓ మోస్తారు స్కోరును చేయగలిగింది.
Kidney Health : చక్కెర, ఉప్పుతో కిడ్నీలకు ముప్పు
ముంబై బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ (32) పరుగులు చేశాడు. వికెట్లు కోల్పోతున్న నిలకడగా ఆడి.. జట్టు స్కోరును పెంచాడు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ (4) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత మిస్టర్ 360 సూర్య కుమార్ (10), తిలక్ వర్మ (7), హార్ధిక్ పాండ్యా డకౌట్ తో ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నేహల్ వద్వేరా (46), టిమ్ డేవిడ్ (35*) క్రీజులో నిలవడంతో ముంబై స్కోరు 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.
Rashmi : వ్యభిచారం గురించి యాంకర్ రష్మి ఏంటి అలా అనేసింది!