Kidney Health : చక్కెర, ఉప్పుతో కిడ్నీలకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్థాయి. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో కొన్ని పదార్థాలు కిడ్నీపై ప్రభావాన్ని చూపుతాయి. మనం శరీరంలోకి పంపే ప్రతి పదార్థం, ఘన, ద్రవ రెండూ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారం వల్ల ప్రభావితమయ్యే ముఖ్యమైన అవయవాల్లో మొదటిది కిడ్నీలు. ఇది మన శరీరంలోని అన్ని ఖనిజాలను సమతుల్యం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉప్పు, చక్కెర, మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల తగిన పోషకాలు అందుతాయి. మూత్రపిండాలపై అదనపు భారం తగ్గుతుంది. ఈ రకమైన ఆహారం రక్తపోటును తగ్గిస్తుంది, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సోడియం, చక్కెర, ప్రోటీన్ తీసుకోవడం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. పొటాషియం, ఫాస్పరస్ స్థాయిని సమతుల్యంగా ఉండటం అవసరం. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వాళ్లు.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా సహజమైన ఆహారాన్ని తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
READ MORE: Rashmi : వ్యభిచారం గురించి యాంకర్ రష్మి ఏంటి అలా అనేసింది!
Also Read
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు, చక్కెర ఉత్పత్తులపై పోషకాహార లేబుల్ను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. ప్రతి వయస్సు వారికి వివిధ పోషకాహార అవసరాలు ఉంటాయి. సోడియం తీసుకోవడం తగ్గించడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. అథ్లెట్లు తమ కఠోరమైన వర్కవుట్ల సమయంలో వారి కిడ్నీలపై భారం పడకుండా తగినంత నీరు, తగినంత పోషకాలను తీసుకోవాలి. వైద్యులు, పోషకాహార నిపుణుల సహాయంతో మూత్రపిండాలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మరింత అవగాహన కలిగి ఉంటే, ఏమి తినాలి, ఎలా జీవించాలి, అనే దాని గురించి తెలుసుకోవాలి. మనం ఏమి తింటున్నామో, అది మన కిడ్నీలను ఎలా ప్రభావితం చేస్తుందో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!