Kidney Health : చక్కెర, ఉప్పుతో కిడ్నీలకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్థాయి. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో కొన్ని పదార్థాలు కిడ్నీపై ప్రభావాన్ని చూపుతాయి. మనం శరీరంలోకి పంపే ప్రతి పదార్థం, ఘన, ద్రవ రెండూ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారం వల్ల ప్రభావితమయ్యే ముఖ్యమైన అవయవాల్లో మొదటిది కిడ్నీలు. ఇది మన శరీరంలోని అన్ని ఖనిజాలను సమతుల్యం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉప్పు, చక్కెర, మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల తగిన పోషకాలు అందుతాయి. మూత్రపిండాలపై అదనపు భారం తగ్గుతుంది. ఈ రకమైన ఆహారం రక్తపోటును తగ్గిస్తుంది, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సోడియం, చక్కెర, ప్రోటీన్ తీసుకోవడం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. పొటాషియం, ఫాస్పరస్ స్థాయిని సమతుల్యంగా ఉండటం అవసరం. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వాళ్లు.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా సహజమైన ఆహారాన్ని తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
READ MORE: Rashmi : వ్యభిచారం గురించి యాంకర్ రష్మి ఏంటి అలా అనేసింది!
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు, చక్కెర ఉత్పత్తులపై పోషకాహార లేబుల్ను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. ప్రతి వయస్సు వారికి వివిధ పోషకాహార అవసరాలు ఉంటాయి. సోడియం తీసుకోవడం తగ్గించడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. అథ్లెట్లు తమ కఠోరమైన వర్కవుట్ల సమయంలో వారి కిడ్నీలపై భారం పడకుండా తగినంత నీరు, తగినంత పోషకాలను తీసుకోవాలి. వైద్యులు, పోషకాహార నిపుణుల సహాయంతో మూత్రపిండాలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మరింత అవగాహన కలిగి ఉంటే, ఏమి తినాలి, ఎలా జీవించాలి, అనే దాని గురించి తెలుసుకోవాలి. మనం ఏమి తింటున్నామో, అది మన కిడ్నీలను ఎలా ప్రభావితం చేస్తుందో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!