Kidney Health : చక్కెర, ఉప్పుతో కిడ్నీలకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్థాయి. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో కొన్ని పదార్థాలు కిడ్నీపై ప్రభావాన్ని చూపుతాయి. మనం శరీరంలోకి పంపే ప్రతి పదార్థం, ఘన, ద్రవ రెండూ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారం వల్ల ప్రభావితమయ్యే ముఖ్యమైన అవయవాల్లో మొదటిది కిడ్నీలు. ఇది మన శరీరంలోని అన్ని ఖనిజాలను సమతుల్యం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉప్పు, చక్కెర, మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల తగిన పోషకాలు అందుతాయి. మూత్రపిండాలపై అదనపు భారం తగ్గుతుంది. ఈ రకమైన ఆహారం రక్తపోటును తగ్గిస్తుంది, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సోడియం, చక్కెర, ప్రోటీన్ తీసుకోవడం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. పొటాషియం, ఫాస్పరస్ స్థాయిని సమతుల్యంగా ఉండటం అవసరం. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వాళ్లు.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా సహజమైన ఆహారాన్ని తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
READ MORE: Rashmi : వ్యభిచారం గురించి యాంకర్ రష్మి ఏంటి అలా అనేసింది!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు, చక్కెర ఉత్పత్తులపై పోషకాహార లేబుల్ను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. ప్రతి వయస్సు వారికి వివిధ పోషకాహార అవసరాలు ఉంటాయి. సోడియం తీసుకోవడం తగ్గించడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. అథ్లెట్లు తమ కఠోరమైన వర్కవుట్ల సమయంలో వారి కిడ్నీలపై భారం పడకుండా తగినంత నీరు, తగినంత పోషకాలను తీసుకోవాలి. వైద్యులు, పోషకాహార నిపుణుల సహాయంతో మూత్రపిండాలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మరింత అవగాహన కలిగి ఉంటే, ఏమి తినాలి, ఎలా జీవించాలి, అనే దాని గురించి తెలుసుకోవాలి. మనం ఏమి తింటున్నామో, అది మన కిడ్నీలను ఎలా ప్రభావితం చేస్తుందో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!