Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
- విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు..
- తొక్కిసలాటకు కోహ్లీనే ప్రధాన కారణమని వెల్లడి..
- కోహ్లీపై కేసును పరిశీలిస్తున్నామని తెలిపిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీనే ప్రధాన కారణమని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అతడి ఫిర్యాదుపై స్పందించిన కబ్బన్ పార్క్ పోలీసులు.. ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. తొక్కిసలాట సంఘటనపై జరుగుతున్న విచారణలో భాగంగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.
Read Also: PhonePe: ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్పే కొత్త అడుగు..!
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా ఉచిత పాస్లు, ప్లేయర్స్ ను కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకున్నారని ఆయన ఆరోపించారు. జట్టులో కీలక ఆటగాడిగా, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ కలిగిన విరాట్ కోహ్లీ, ఈ ఈవెంట్కు సంబంధించిన ప్రకటనలలో భాగస్వామ్యం వహించాడు.. కాబట్టి ఈ తొక్కిసలాటకు అతను కూడా బాధ్యుడే అని ఫిర్యాదులో వెల్లడించాడు.
Read Also: Asian Sunil : రేపు ఏషియన్ సునీల్ ప్రెస్ మీట్.. కీలక విషయాలు మాట్లాడే ఛాన్స్..?
ఇక, పోలీసులు ఇప్పటికే ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?