PhonePe: ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్పే కొత్త అడుగు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే (PhonePe) ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్ పే టెక్నాలజీకి చెందిన కన్వర్సేషనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫారమ్ ‘గప్ చుప్’ను ఫోన్పే ఇటీవలే కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
ఫోన్పే వెల్లడించిన ప్రకారం, రానున్న త్రైమాక్షికలో భారత్ లోని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూపీఐ మొబైల్ యాప్ ను విడుదల చేయనున్నది. ఈ యాప్ ద్వారా పీర్-టు-పీర్ (P2P) లావాదేవీలు, ఆఫ్ లైన్ క్యూఆర్ కోడ్ చెల్లింపులు, ఇతర యూపీఐ వినియోగదారుల నుండి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఆధారంగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు.
Also Read
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
Read Also: Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!
ఈ సేవలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూపీఐ 123పే ఆధారంగా పనిచేసే జీఎస్ పే (GS Pay) టెక్నాలజీ ద్వారా అందించనున్నారు. ఫీచర్ ఫోన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ టెక్నాలజీ ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం నోకియా సంస్థ తయారు చేసిన కొన్ని ఫీచర్ ఫోన్లలో గప్ చుప్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ యాప్లో ఎస్ఎంఎస్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ను అనుసంధానించొచ్చు. అనంతరం ‘పే’ ఆప్షన్ ద్వారా యూజర్లు యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇదే యాప్ స్థానంలో ఫోన్పే సరికొత్త యాప్ ను త్వరలో అందించనుంది.
Read Also: Minister Ramanaidu: ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!
స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకే పరిమితంగా ఉండకుండా ఫోన్పే ఈ నిర్ణయం తీసుకున్నదాని వెనుక లక్ష్యం. ఫీచర్ ఫోన్ వాడుతున్న ప్రజలకు కూడా డిజిటల్ చెల్లింపు వేదికలను అందించడమే. ఈ మేరకు ఫోన్పే సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.., “డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక కీలక అడుగని తెలిపారు. ఈ కొత్త యాప్తో ఫీచర్ ఫోన్ వినియోగదారులకూ యూపీఐ ఆధారిత చెల్లింపులు, లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.
తాజావార్తలు
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..