Sunil Joshi: సంజూ కంటే బాగా ఆడుతున్నాడు.. అతడ్ని టీమిండియాకి ఎంపిక చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitesh Sharma Is Better Than Sanju Samson Says Sunil Joshi: ఈ ఐపీఎల్ సీజన్లో కొందరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లలో జితేశ్ శర్మ ఒకడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కీపర్గా సత్తా చాటుతూ, బ్యాటింగ్ పరంగానూ దుమ్ముదులిపేస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కొన్నిసార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీ-రోల్ పోషించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అతడ్ని టీమిండియాకు ఎంపిక చేయాలని అభిప్రాయాలూ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ కంటే అతడు చాలా బాగా ఆడుతున్నాడని, అతనికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించాలని చెప్పాడు.
Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..

సునీల్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ ఐపీఎల్ సీజన్లో జితేశ్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి.. సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలల నుంచి అతడు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గతంలో కొన్ని టీ20 సిరీస్లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు కూడా. కానీ, అతడ్ని బెంచ్కే పరిమితం చేశారు. ఈసారి మాత్రం అతనికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్ తరఫున ఎలా ఆడుతున్నాడో, టీమిండియా తరఫున అంతే అద్భుతంగా రాణిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చారు. తన సత్తా చాటుకోవడానికి, జితేశ్కు అవకాశం కల్పించాలని ఆయన కోరాడు. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకూ 10 మ్యాచ్లో ఆడిన జితేశ్ శర్మ 165.97 స్ట్రైక్ రేట్తో239 పరుగులు చేశాడు. ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చే ఇతగాడు.. పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్గా మారాడు.
తాజావార్తలు
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!