Sunil Joshi: సంజూ కంటే బాగా ఆడుతున్నాడు.. అతడ్ని టీమిండియాకి ఎంపిక చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitesh Sharma Is Better Than Sanju Samson Says Sunil Joshi: ఈ ఐపీఎల్ సీజన్లో కొందరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లలో జితేశ్ శర్మ ఒకడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కీపర్గా సత్తా చాటుతూ, బ్యాటింగ్ పరంగానూ దుమ్ముదులిపేస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కొన్నిసార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీ-రోల్ పోషించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అతడ్ని టీమిండియాకు ఎంపిక చేయాలని అభిప్రాయాలూ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ కంటే అతడు చాలా బాగా ఆడుతున్నాడని, అతనికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించాలని చెప్పాడు.
Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సునీల్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ ఐపీఎల్ సీజన్లో జితేశ్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి.. సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలల నుంచి అతడు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గతంలో కొన్ని టీ20 సిరీస్లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు కూడా. కానీ, అతడ్ని బెంచ్కే పరిమితం చేశారు. ఈసారి మాత్రం అతనికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్ తరఫున ఎలా ఆడుతున్నాడో, టీమిండియా తరఫున అంతే అద్భుతంగా రాణిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చారు. తన సత్తా చాటుకోవడానికి, జితేశ్కు అవకాశం కల్పించాలని ఆయన కోరాడు. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకూ 10 మ్యాచ్లో ఆడిన జితేశ్ శర్మ 165.97 స్ట్రైక్ రేట్తో239 పరుగులు చేశాడు. ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చే ఇతగాడు.. పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్గా మారాడు.
తాజావార్తలు
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!