Sunil Joshi: సంజూ కంటే బాగా ఆడుతున్నాడు.. అతడ్ని టీమిండియాకి ఎంపిక చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitesh Sharma Is Better Than Sanju Samson Says Sunil Joshi: ఈ ఐపీఎల్ సీజన్లో కొందరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లలో జితేశ్ శర్మ ఒకడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కీపర్గా సత్తా చాటుతూ, బ్యాటింగ్ పరంగానూ దుమ్ముదులిపేస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కొన్నిసార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీ-రోల్ పోషించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అతడ్ని టీమిండియాకు ఎంపిక చేయాలని అభిప్రాయాలూ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ కంటే అతడు చాలా బాగా ఆడుతున్నాడని, అతనికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించాలని చెప్పాడు.
Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..

సునీల్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ ఐపీఎల్ సీజన్లో జితేశ్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి.. సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలల నుంచి అతడు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గతంలో కొన్ని టీ20 సిరీస్లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు కూడా. కానీ, అతడ్ని బెంచ్కే పరిమితం చేశారు. ఈసారి మాత్రం అతనికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్ తరఫున ఎలా ఆడుతున్నాడో, టీమిండియా తరఫున అంతే అద్భుతంగా రాణిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చారు. తన సత్తా చాటుకోవడానికి, జితేశ్కు అవకాశం కల్పించాలని ఆయన కోరాడు. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకూ 10 మ్యాచ్లో ఆడిన జితేశ్ శర్మ 165.97 స్ట్రైక్ రేట్తో239 పరుగులు చేశాడు. ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చే ఇతగాడు.. పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్గా మారాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!