GT vs LSG: లక్నో జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Won By 56 Runs Against Lucknow Super Giants: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరపరాజయం చవిచూసింది. జీటీ నిర్దేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. గుజరాత్ జట్టు 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. మొదట్లో కైల్ మేయర్స్, డీకాక్ శుభారంభాన్నే అందించారు కానీ.. ఆ తర్వాత లక్నో జట్టు పూర్తిగా పట్టు కోల్పోయింది. ఇతర ఆటగాళ్లెవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. కైల్ మేయర్స్ ఔట్ అవ్వగానే.. మిగతా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. స్టార్ ఆటగాళ్లు సైతం చేతులు ఎత్తేయడంతో.. లక్నో జట్టుకి ఓటమి తప్పలేదు.
Sunrisers Hyderabad: హ్యారీ బ్రూక్ని తొలగించి.. అతనికి అవకాశం ఇవ్వండి
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (81), శుభ్మన్ గిల్ (94 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో.. జీటీ అంత భారీ స్కోరు చేయగలిగింది. హార్దిక్ (25), మిల్లర్ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. తమ జట్టుకు తమవంతు సహకారం అందించారు. అనంతరం 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితం అయ్యింది. మొదట్లో ఓపెనర్లు కైల్ మేయర్స్, డీకాక్ తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. పవర్ ప్లేలో ఇద్దరు కలిసి దంచికొట్టారు. 10కి పైగా రన్ రేట్తో పరుగుల సునామీ సృష్టించారు. కానీ.. ఎప్పుడైతే కైల్ మేయర్స్ ఔట్ అయ్యాడో, అప్పటి నుంచి లక్నో పతనం మొదలైంది. మైల్ మేయర్స్ పోయిన తర్వాత, ఏ ఒక్క ఆటగాడు కూడా నిలకడగా రాణించలేదు. ఇలా క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
Adah Sharma: ఆ వివాదం ఏమో కానీ.. ఈ చిన్నదానికి ఇన్నాళ్లకు స్టార్ డమ్ వచ్చింది
అప్పటికీ డీకాక్ ఒంటరి పోరాటం కొనసాగించాడు కానీ.. ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో, అతడూ నీరసించిపోయాడు. స్టోయినిస్, పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం చేతులెత్తేశారు. మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన బదోని ఒక్కడే.. రెండు సిక్సులు, ఒక ఫోర్తో కాస్త మెరుపులు మెరిపించాడంతే. కెప్టెన్ కృనాల్ పాండ్యా అయితే డకౌట్గా వెనుదిరిగాడు. ఇలా ప్రధాన బ్యాటర్లందరూ హ్యాండ్ ఇవ్వడంతో.. లక్నో 56 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!