Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో ఉంటున్న మహిళలు, తాము స్నానం చేస్తుండగా తమను మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీస్తున్నారని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Rohit Sharma: "నన్ను క్షమించు.." మహిళా అభిమానికి 'హిట్ మ్యాన్' స్పెషల్ రిక్వెస్ట్..!
- Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
- Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
కోర్టు విచారణ..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి.. ఈ వారం మొదట్లో ఆ ఇద్దరు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అలుత్కాడె మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఒక్కొక్కరికి 5,00,000 శ్రీలంక రూపాయల (సుమారు 1,564 డాలర్లు) వ్యక్తిగత బాండ్లపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.
పోలీసుల దర్యాప్తు..
నారాహెన్పిటా పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సదరు క్రీడాకారులు చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోగానీ లేదా ఇతరులకు గానీ షేర్ చేశారా అనే కోణంలో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందన..
ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇంకా ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలను ప్రకటించలేదు. అయితే.. గత 48 గంటల్లో బోర్డులో భారీ మార్పులు జరగడం విశేషం. పాత ఆఫీస్ బేరర్లను తొలగించి, వారి స్థానంలో ఒక ‘ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ’ని నియమించారు. ఈ పరిపాలనాపరమైన మార్పుల నేపథ్యంలో, నిందితులైన ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
సాధారణంగా అండర్-19 స్థాయిలో ఉన్న క్రీడాకారులకు భవిష్యత్తులో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి నేరారోపణలు ఎదుర్కోవడం వల్ల వారి కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా పలువురు శ్రీలంక క్రికెటర్లు క్రమశిక్షణా రాహిత్యం వల్ల నిషేధానికి గురయ్యారు. తాజా ఘటనతో క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేయాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?