Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో ఉంటున్న మహిళలు, తాము స్నానం చేస్తుండగా తమను మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీస్తున్నారని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
కోర్టు విచారణ..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి.. ఈ వారం మొదట్లో ఆ ఇద్దరు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అలుత్కాడె మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఒక్కొక్కరికి 5,00,000 శ్రీలంక రూపాయల (సుమారు 1,564 డాలర్లు) వ్యక్తిగత బాండ్లపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.
పోలీసుల దర్యాప్తు..
నారాహెన్పిటా పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సదరు క్రీడాకారులు చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోగానీ లేదా ఇతరులకు గానీ షేర్ చేశారా అనే కోణంలో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందన..
ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇంకా ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలను ప్రకటించలేదు. అయితే.. గత 48 గంటల్లో బోర్డులో భారీ మార్పులు జరగడం విశేషం. పాత ఆఫీస్ బేరర్లను తొలగించి, వారి స్థానంలో ఒక ‘ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ’ని నియమించారు. ఈ పరిపాలనాపరమైన మార్పుల నేపథ్యంలో, నిందితులైన ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
సాధారణంగా అండర్-19 స్థాయిలో ఉన్న క్రీడాకారులకు భవిష్యత్తులో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి నేరారోపణలు ఎదుర్కోవడం వల్ల వారి కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా పలువురు శ్రీలంక క్రికెటర్లు క్రమశిక్షణా రాహిత్యం వల్ల నిషేధానికి గురయ్యారు. తాజా ఘటనతో క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేయాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి