Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అద్భుతమైన ఫామ్తో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాస్తూ, సంచలనంగా మారాడు. క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో తన మొదటి 50 ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సుదర్శన్ 50 ఇన్నింగ్స్ల్లో 2178 పరుగులు సాధించగా, అంతకుముందు ఈ రికార్డు 2061 పరుగులతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. కేవలం 24 ఏళ్ల వయసులోనే గేల్ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం. ఈ జాబితాలో మిచెల్ మార్ష్ (1933 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ సీజన్లో సాయి సుదర్శన్ గేల్ రికార్డును తుడిచిపెట్టడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. గేల్ 48 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్ల్లోనే దాన్ని అందుకున్నాడు. 2026 సీజన్ ఆరంభంలో కాస్త నెమ్మదించినా, గత నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడు హాఫ్ సెంచరీలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేసిన మెరుపు శతకం (100) అతని సత్తా ఏంటో నిరూపించాయి. 2022లో అరంగేట్రం చేసిన సుదర్శన్, ప్రస్తుతం 47.34 సగటు మరియు 148 స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు.
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ఇక పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు సైతం అద్భుతంగా రాణించారు. జేసన్ హోల్డర్ 4 వికెట్లతో చెలరేగగా, సిరాజ్, రబడ చెరో రెండు వికెట్లు తీశారు. పంజాబ్ బ్యాటర్ సూర్యాన్ష్ షెడ్జ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 163 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ నిలకడైన ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. సుదర్శన్ రికార్డుల పరంపర చూస్తుంటే, అతను ఐపీఎల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాడని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!