T20 World Cup 2024: ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి.. భారత జట్టుకు అశ్వత్థామ స్పెషల్ మెసేజ్ (వీడియో)!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం కండి’ అని బిగ్బీ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘టీ20 ప్రపంచకప్ 2024 కోసం శంఖనాదం మోగింది’ అనే క్యాప్షన్తో స్టార్ స్పోర్ట్స్ ఇండియా, కల్కి 2898 ఏడీలు తమ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశాయి. ఈ వీడియోలో అశ్వత్థామగా అమితాబ్ భారత ఆటగాళ్లలో ప్రేరణ నింపుతుండగా.. బ్యాగ్రౌండ్లో కల్కి సినిమా మ్యూజిక్ ప్లే అవుతోంది. ‘ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. విజయం ముందు అస్సలు తలవంచొద్దు. ధైర్యంగా ఉండి మీ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించండి. దేశంలోని ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి.. అప్పుడే దేశం కోసం మీరు బాగా సన్నద్ధం అవుతారు’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Hari Hara Veera Mallu: డైరెక్టర్ క్రిష్ని తప్పించలేదు.. తప్పుకున్నాడు!
బిగ్బీ అమితాబ్ బచ్చన్ భారత క్రికెటర్లకు సందేశం ఇస్తుండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తదితర క్రికెటర్లను వీడియోలో చూపించారు. అంతేకాదు 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన మొమెంట్స్ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన నెటిజెన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అమితాబ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి ఎంజాయ్ చేస్తారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!