T20 World Cup 2024: ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి.. భారత జట్టుకు అశ్వత్థామ స్పెషల్ మెసేజ్ (వీడియో)!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం కండి’ అని బిగ్బీ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘టీ20 ప్రపంచకప్ 2024 కోసం శంఖనాదం మోగింది’ అనే క్యాప్షన్తో స్టార్ స్పోర్ట్స్ ఇండియా, కల్కి 2898 ఏడీలు తమ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశాయి. ఈ వీడియోలో అశ్వత్థామగా అమితాబ్ భారత ఆటగాళ్లలో ప్రేరణ నింపుతుండగా.. బ్యాగ్రౌండ్లో కల్కి సినిమా మ్యూజిక్ ప్లే అవుతోంది. ‘ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. విజయం ముందు అస్సలు తలవంచొద్దు. ధైర్యంగా ఉండి మీ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించండి. దేశంలోని ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి.. అప్పుడే దేశం కోసం మీరు బాగా సన్నద్ధం అవుతారు’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Hari Hara Veera Mallu: డైరెక్టర్ క్రిష్ని తప్పించలేదు.. తప్పుకున్నాడు!
బిగ్బీ అమితాబ్ బచ్చన్ భారత క్రికెటర్లకు సందేశం ఇస్తుండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తదితర క్రికెటర్లను వీడియోలో చూపించారు. అంతేకాదు 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన మొమెంట్స్ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన నెటిజెన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అమితాబ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి ఎంజాయ్ చేస్తారు.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!