టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని దగ్గరి నుంచి చూడడమే ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తుంటారు. అలాంటిది ధోనితో ఫోటోలు దిగాలనుకోవడం కాస్త రిస్కే.. ఎందుకంటే మ్యాచ్లు లేని సమయంలో ధోని ప్రైవసీగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతాడు. సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటాడు. తన భార్య సాక్షి సింగ్ పుణ్యమా అని ధోని అప్డేట్స్ బయటకు తెలుస్తుంటాయి. అలాంటిది ఎంఎస్ ధోని ఫ్లైట్లో నిద్రపోతున్న వేళ అతని వీరాభిమాని అయిన ఒక ఎయిర్ హోస్టెస్ వీడియో తీయడం ప్రస్తుతం వైరల్గా మారింది.
Read Also: Danger: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ సాంగ్..శ్రీ లీల ‘డేంజర్ పిల్ల’ అంటోన్న నితిన్..
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. తన అభిమాన ఆటగాడిని చూసిన సంతోషంలో ఎయిర్ హోస్టెస్ మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. ధోనితో ఫోటో దిగాలన్న తన కోరిక ఇలా అయినా నెరవేరిందనుకుంటా.. అయితే దగ్గరకి వెళ్లి సెల్పీ అడిగి ధోని కచ్చితంగా ఇచ్చేవాడేమో.. కానీ నిద్రపోతున్న ధోనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా దొంగచాటుగా ఎయిర్ హోస్టెస్ వీడియో తీసుకొని సంతోష పడింది.
Read Also: Tomato Price: కిలో టమాటా ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
అయితే ఇది చూసిన ఫ్యాన్స్ ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తు ఇలా వీడియోలు తీయడం ఏంటని విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం తమ రోల్మోడల్గా భావించే వ్యక్తి మన కళ్ల ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆనందం వర్ణించలేమని పేర్కొన్నారు. ఇక 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఇప్పటికి ఇసుమంతైనా కూడా తగ్గలేదు. ఇప్పుడు ధోని బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగుపెడితే టీఆర్పీ రేటింగ్లు బద్దలవుతున్నాయి. అది ఎలా ఉంటుందో ఇటీవలే ఐపీఎల్ 2023 సీజన్లో నేరుగా చూశాం.. ఇక ఈ ఐపీఎల్లో సీఎస్కే విజేతగా నిలింది. ధోని నేతృత్వంలో సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి.. ఇక వచ్చే సీజన్ ఆడే విషయంపై ఏడు-ఎనిమిది నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ధోనినే డైరెక్టుగా చెప్పాడు.
MS Dhoni is an emotion, He's everyone's favourites.
What a beautiful video! pic.twitter.com/GSxgXpArc2
— CricketMAN2 (@ImTanujSingh) July 29, 2023