ABD: జట్టు ఇప్పుడు సరైన బ్యాలెన్స్గా ఉంది.. ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది
- ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయం
- బెంగళూరు జట్టుపై ఏబీ డివిలియర్స్ ప్రశంసలు
- గత సీజన్లతో పోలిస్తే ఈసారి జట్టు బ్యాలెన్స్ పది రెట్లు మెరుగుపడింది- ఏబీ
- గత ఏడాది ఆర్సీబీ జట్టుకు బ్యాలెన్స్ లేకపోయింది- ఏబీ
- ఈసారి ఆర్సీబీ జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది- ఏబీ డివిలియర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 సీజన్ను శుభారంభంతో ప్రారంభించింది. తమ తొలి రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయాలను నమోదు చేసి, అభిమానులను ఆకట్టుకుంది. మొదటి మ్యాచ్లో మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పై విజయం సాధించగా, రెండవ మ్యాచ్లో ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయాలతో ఆర్సీబీ జట్టు ప్రస్తుత సీజన్లో మెరుగైన సమతుల్యత (బ్యాలెన్స్)ను చూపుతోందని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
Read Also: Venkaiah Naidu: ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించడం జట్టుకు గర్వకారణంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ‘AB డివిలియర్స్ 360’ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, “గత సీజన్లతో పోలిస్తే ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాలెన్స్ పది రెట్లు మెరుగుపడింది” అని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆర్సీబీ జట్టుకు బ్యాలెన్స్ లేకపోయిందని.. ఈసారి ఆ లోటు తీర్చబడిందని తెలిపారు. “బౌలర్లు, బ్యాట్స్మెన్, ఫీల్డర్లను మాత్రమే కాకుండా.. మొత్తం జట్టు సరైన బ్యాలెన్స్ ఉండటం ఎంతో అవసరం. ఈసారి ఆర్సీబీ జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది” అని అన్నారు.
Read Also: Rythu Bandhu : తెలంగాణలో రైతులకు శుభవార్త..
భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుతూ.. “భువీ మొదటి మ్యాచ్లో జట్టులో లేకపోయినా, రెండవ మ్యాచ్లో ఆడారు. జట్టుకు అవసరమైన బ్యాలెన్స్ అంటే ఇదే. ప్లేయర్లను రొటేట్ చేసేందుకు, ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసేలా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది” అని వివరించారు. కాగా.. ఐపీఎల్ 2025లో బెంగళూరు జట్టుకి ఇది అత్యుత్తమ ఆరంభంగా పేర్కొనవచ్చు. కేవలం ఫలితాల పరంగా కాకుండా, జట్టులో కూడా ఇది చాలా ముఖ్యమైన మార్పుగా చెబుతున్నారు. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను వారి సొంత మైదానంలో ఓడించగా.. రెండవ మ్యాచ్లో చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించడం గొప్ప విజయంగా నిలిచింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!