IND vs AUS: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. సత్తా చాటిన స్పిన్నర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won Second Test Match Against Australia In Delhi: ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ జట్టుపై భారత్ గెలుపొందింది. ప్రత్యర్థి జట్టు కుదిర్చిన 115 పరుగుల లక్ష్యాన్ని.. నాలుగు వికెట్ల నష్టానికి భారత్ ఛేదించింది. దీంతో.. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో మన భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ కలిసి అద్భుతంగా రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా తిప్పేయడంతో.. కంగారులు కకావికలం అయ్యారు. అతని ధాటికే ఆసీస్ జట్టు స్వల్ప స్కోరుతో చాపచుట్టేసింది. లక్ష్యంతో చిన్నదే కావడంతో.. భారత బ్యాటర్లు సునాసాయంగా చేధించేశారు.
Bihar: భయపడి సెల్ఫోన్ మింగేసిన ఖైదీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్లో భాగంగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. 262 పరుగులకి కుప్పకూలింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఆసీస్ శుభారంభమే చేసింది. రెండో రోజు ఆటకు 62/1 పరుగులతో ముగించింది. మూడో రోజు ఆట ప్రారంభమయ్యాక కూడా ఆసీస్ జట్టు పటిష్టంగానే కనిపించింది. కానీ, ఆ తర్వాత జడేజా చేతిలో చిత్తుచిత్తు అయ్యింది. ట్రావిస్ హెడ్ (43), మార్నస్ (35) మినహాయిస్తే.. మిగతా ఆసీస్ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. అందులో ముగ్గురు సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో జడేజా 7 వికెట్లతో చెలరేగిపోగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ..
ఇక 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదటినుంచి ఆచితూచి ఆడుతూ, లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహాలో పరుగుల వర్షం కురిపించాడు. దీంతో.. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్లో సహాయంతో 31 పరుగులు చేశాడు. అయితే.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (1) ఎప్పట్లాగే నిరాశపరిచాడు. కోహ్లీ (20), శ్రేయస్ (12) కూడా పెద్దగా రాణించలేకపోయారు. శ్రీకర్తో కలిసి పుజారా జట్టుని లక్ష్యం దిశగా తీసుకెళ్లి, గెలిపించాడు.
RRR: మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!