IND Vs WI: నాలుగో టీ20లోనూ అదరగొట్టిన టీమిండియా.. సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. అతడు తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి వెనుతిరిగాడు. సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ హుడా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్తో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
అనంతరం 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. బ్రెండన్ కింగ్ 13 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. వెంటనే డేవాన్ థామస్ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. నికోలస్ పూర్(24), కైల్ మేయర్స్(13), రోవ్మన్ పొవెల్ (24) కూడా వరుసగా వెనుతిరిగారు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. హోల్డర్ (13) కూడా నిరాశపరిచాడు. దీంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకు వెస్టిండీస్ ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు సాధించారు. అంతకుముందు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు కల్పించింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ముందు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కాగా సిరీస్లో చివరి నామమాత్రమైన టీ20 ఆదివారం రాత్రి జరగనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!