IND Vs WI: నాలుగో టీ20లోనూ అదరగొట్టిన టీమిండియా.. సిరీస్ కైవసం
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. అతడు తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి వెనుతిరిగాడు. సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ హుడా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్తో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?
Also Read
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
అనంతరం 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. బ్రెండన్ కింగ్ 13 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. వెంటనే డేవాన్ థామస్ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. నికోలస్ పూర్(24), కైల్ మేయర్స్(13), రోవ్మన్ పొవెల్ (24) కూడా వరుసగా వెనుతిరిగారు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. హోల్డర్ (13) కూడా నిరాశపరిచాడు. దీంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకు వెస్టిండీస్ ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు సాధించారు. అంతకుముందు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు కల్పించింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ముందు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కాగా సిరీస్లో చివరి నామమాత్రమైన టీ20 ఆదివారం రాత్రి జరగనుంది.
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?