IND Vs WI: నాలుగో టీ20లోనూ అదరగొట్టిన టీమిండియా.. సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. అతడు తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి వెనుతిరిగాడు. సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ హుడా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్తో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
అనంతరం 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. బ్రెండన్ కింగ్ 13 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. వెంటనే డేవాన్ థామస్ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. నికోలస్ పూర్(24), కైల్ మేయర్స్(13), రోవ్మన్ పొవెల్ (24) కూడా వరుసగా వెనుతిరిగారు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. హోల్డర్ (13) కూడా నిరాశపరిచాడు. దీంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకు వెస్టిండీస్ ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు సాధించారు. అంతకుముందు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు కల్పించింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ముందు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కాగా సిరీస్లో చివరి నామమాత్రమైన టీ20 ఆదివారం రాత్రి జరగనుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!