T20 Wolrd Cup Final : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమైంది. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన టీమ్ ఇండియా, మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. గత 2024 టీ20 ప్రపంచకప్ గెలుపు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. వేలమంది అభిమానుల ‘వందేమాతరం’ నినాదాల మధ్య భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా, అలాగే మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడి సిక్సర్ల వర్షం కురిపించారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు ఆది నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా లోకల్ హీరో అక్షర్ పటేల్ పవర్ప్లేలోనే ఫిన్ అలెన్ వంటి ప్రమాదకర బ్యాటర్ను అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ మాయాజాలంతో కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా, ఒక దశలో హ్యాట్రిక్ తీసేంత పని చేశాడు. మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్ వంటి సీనియర్లను తన అద్భుతమైన స్లోయర్ డెలివరీలతో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫెర్ట్ ఒక్కడే 52 పరుగులతో పోరాడినప్పటికీ, వరుణ్ చక్రవర్తి అతడిని అవుట్ చేయడంతో కివీస్ పతనం పూర్తయింది. చివరలో అభిషేక్ శర్మ బౌలింగ్లో జాకబ్ డఫ్ఫీ వికెట్ తీయడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఫీల్డింగ్లో కూడా భారత్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు పట్టిన క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి. ఈ విజయంతో భారత్ కేవలం టైటిల్ను గెలవడమే కాకుండా, టీ20 ఫార్మాట్లో తామే అసలైన ‘బాస్’ అని నిరూపించుకుంది. మ్యాచ్ ముగియగానే స్టేడియం మొత్తం బాణాసంచా వెలుగులతో, అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది.
Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..