IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న వెస్టిండీస్తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ 19వ ఓవర్లో మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు.
అతను కేవలం నాలుగు పరుగులకే నికోలస్ పూరన్ వికెట్ సాధించాడు. రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ అర్ధ సెంచరీలతో పోరాడినప్పటికీ, మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైంది వెస్టిండీస్. వెస్టిండీస్ కీలక భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ బ్రేక్ చేశాడు. బిష్ణోయ్ వేసిన అద్భుత క్యాచ్ను అందుకుని భువనేశ్వర్ పూరన్ను పెవిలియన్కు పంపాడు. వెస్టిండీస్ అంతకుముందు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వికెట్లను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
Read also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు అర్ధశతకాలు బాదడంతో భారత్ వెస్టిండీస్పై 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ తర్వాత పంత్ (28 బంతుల్లో 52), కోహ్లీ (41 బంతుల్లో 52) భారీ సంఖ్యలో పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను వెస్టిండీస్ తక్కువ సమయంలోనే అవుట్ చేశారు. వెంకటేష్ అయ్యర్, పంత్తో కలిసి చివరి ఏడు ఓవర్లలో 88 పరుగులకు చేరుకోగలిగింది టీమిండియా. వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. కాగా 100వ టీ20లో విజయం సాధించిన భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!