IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న వెస్టిండీస్తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ 19వ ఓవర్లో మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు.
అతను కేవలం నాలుగు పరుగులకే నికోలస్ పూరన్ వికెట్ సాధించాడు. రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ అర్ధ సెంచరీలతో పోరాడినప్పటికీ, మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైంది వెస్టిండీస్. వెస్టిండీస్ కీలక భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ బ్రేక్ చేశాడు. బిష్ణోయ్ వేసిన అద్భుత క్యాచ్ను అందుకుని భువనేశ్వర్ పూరన్ను పెవిలియన్కు పంపాడు. వెస్టిండీస్ అంతకుముందు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వికెట్లను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
Read also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు అర్ధశతకాలు బాదడంతో భారత్ వెస్టిండీస్పై 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ తర్వాత పంత్ (28 బంతుల్లో 52), కోహ్లీ (41 బంతుల్లో 52) భారీ సంఖ్యలో పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను వెస్టిండీస్ తక్కువ సమయంలోనే అవుట్ చేశారు. వెంకటేష్ అయ్యర్, పంత్తో కలిసి చివరి ఏడు ఓవర్లలో 88 పరుగులకు చేరుకోగలిగింది టీమిండియా. వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. కాగా 100వ టీ20లో విజయం సాధించిన భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!