దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్.. తొలి సిరీస్ కోసం టీమిండియా ఆరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్ల సిరీస్లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ను గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు.. రెండో టెస్ట్లో షాక్ ఇచ్చింది సౌతాఫ్రికా.. అయితే, చివరి టెస్ట్ మ్యాచ్లోనైనా సర్వశక్తులు ఒడ్డి అద్భుతాన్ని ఆవిష్కృతం చేయాలన్న పట్టుదలతో ఉంది భారత జట్టు..
Read Also: జనవరి 11, మంగళవారం దినఫలాలు…
Also Read
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో ఇవాళ కేప్టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నిర్ణాయక మ్యాచ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారత్కు ఇదే చక్కటి అవకాశంగా విశ్లేషకులు చెబుతున్నారు… దక్షిణాఫ్రికా గడ్డపై తన కెప్టెన్సీలోనే జట్టుకు అపురూప విజయం అందించాలని కోహ్లీ తపన పడుతున్నాడు. అటు రెండో టెస్టులో గెలిచిన జోష్లో ఉన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్లోనూ పట్టు సడలించకూడదని భావిస్తోంది. ఇవాళ ఫైనల్గా బరిలోకి దిగే జట్ల వివరాలు పరిశీలిస్తే.. భారత్ నుంచి కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానె, రిషబ్ పంత్, శార్దూల్ పటేల్, అశ్విన్, షమి, బుమ్రా, ఇషాంత్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, వెర్రెనీ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఒలివియెర్, ఎన్గిడి బరిలోకి దిగే అవకాశం ఉంది.. మరి పేసర్లకు బాగా అనుకూలించే కేప్టౌన్లో మ్యాచ్ గెలిచేది ఎవరు? తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి భారత్ సత్తా చాటుతుందా..? సౌతాఫ్రికానే ట్రోఫీని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!