Himanta Biswa Sharma: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై అసలు కారణం చెప్పిన అసోం సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత జట్టు ఓటమి పాలవ్వడంతో భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే, ఈ ఓటమికి రకరకాల కారణాలు చూపుతూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో విశ్లేషణలు కాస్త శ్రుతిమించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీశాయి. ఇక, తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ తరహా కామెంట్స్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు ఇందిరాగాంధీ జన్మదినం కావడంతోనే టీమిండియా ప్రపంచ కప్ను కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
Read Also: Vijayawada: భవాని మండల దీక్ష ధారణ.. ఇంద్రకీలాద్రి పై నేటి నుండి ప్రారంభం
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు. బీసీసీఐకి నా దగ్గర ఒక సలహా.. దయచేసి గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియా మ్యాచ్లు పెట్టొద్దని బిశ్వశర్మ సూచించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: KIMS Hospital: కిమ్స్ ఆస్పత్రిలో మంటలు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ రోగులు
కాగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లడంతో దురదృష్టం వెంటాడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీని ప్రస్తావిస్తూ ‘పనౌటీ’ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.. ఇదిలా ఉండగా గత ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి వెళ్లారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!