Himanta Biswa Sharma: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై అసలు కారణం చెప్పిన అసోం సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత జట్టు ఓటమి పాలవ్వడంతో భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే, ఈ ఓటమికి రకరకాల కారణాలు చూపుతూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో విశ్లేషణలు కాస్త శ్రుతిమించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీశాయి. ఇక, తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ తరహా కామెంట్స్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు ఇందిరాగాంధీ జన్మదినం కావడంతోనే టీమిండియా ప్రపంచ కప్ను కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
Read Also: Vijayawada: భవాని మండల దీక్ష ధారణ.. ఇంద్రకీలాద్రి పై నేటి నుండి ప్రారంభం
Also Read
- LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు. బీసీసీఐకి నా దగ్గర ఒక సలహా.. దయచేసి గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియా మ్యాచ్లు పెట్టొద్దని బిశ్వశర్మ సూచించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: KIMS Hospital: కిమ్స్ ఆస్పత్రిలో మంటలు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ రోగులు
కాగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లడంతో దురదృష్టం వెంటాడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీని ప్రస్తావిస్తూ ‘పనౌటీ’ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.. ఇదిలా ఉండగా గత ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి వెళ్లారు.
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!