రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ టెస్టు..బౌలర్లపైనే భారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్ 31, హమీద్ 43 పరుగులతో నాటౌట్గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరం. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్ చేయాలి. నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు రవీంద్ర జడేజా 8పరుగులు జత చేయగా.. రహానే డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్లో స్లిప్లో దొరికి పోయాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేసింది.
తర్వాత రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా భారీ స్కోర్కు బాటలు వేసారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 466 పరుగులకు ఆలౌటైంది.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్కు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి శుభారంభాన్ని అందించారు. భారత బౌలర్లను సమర్థవంతా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వికెట్ కోసం కోహ్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే తొలి వికెట్ 77 పరుగుల భాగస్వామ్యంతో అజేయంగా నిలిచారు.మొత్తంగా నాలుగో టెస్టులో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు.
Also Read
- PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ఫుల్ ఫామ్లోకి వచ్చారు. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ అయితే ఉంచగలిగారు. ఇక జట్టు విజయం బౌలర్ల చేతిలో చేతిలో ఉంది. నాలుగో టెస్టులో ఇవాళే చివరి రోజు. దీంతో వికెట్లు పడకుండా ఆచితూచి ఆడేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించే అవకాశముంది. నిన్న 32 ఓవర్లు ఆడినా ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ పది వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను ఆలౌట్ చేయగలిగితేనే విజయం భారత్ సొంతమౌతుంది. అయితే ఓవల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఈ స్టేడియంలో భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. ఇంగ్లండ్ను కట్టడి చేయడం బౌలర్లకు కత్తిమీద సామనే చెప్పాలి. కాని క్రెకెట్లో ఏదైనా సాధ్యమే అంటారు క్రీడావిశ్లేషకులు. భారీ టార్గెట్ను అవకాశంగా మలుచుకుని ఆలౌట్ చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నాలుగో టెస్టు క్రికెట్ లవర్స్కు మంచి కిక్ ఇస్తోంది.
తాజావార్తలు
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?