Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీం ఇండియా చేపట్టబోయే కీలకమైన ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం జట్లను ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటన అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది.
Also Read :Shubman Gill : రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా గిల్..
Also Read
- IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
- Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
- India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
వన్డే సారథిగా శుభ్మాన్ గిల్
ఈ పర్యటనలో అతిపెద్ద మార్పు కెప్టెన్సీకి సంబంధించిందే. టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్మాన్ గిల్కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో, గతంలో కెప్టెన్గా వ్యవహరించిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇకపై కేవలం బ్యాట్స్మన్గా మాత్రమే జట్టులో కొనసాగుతాడు. డిసెంబర్ 2021 తర్వాత రోహిత్ శర్మ ఒక సాధారణ ఆటగాడిగా జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
Also Read :IND vs WI: వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
తిరిగి వచ్చిన సీనియర్లు.. విశ్రాంతిలో బుమ్రా
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత సీనియర్ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీం ఇండియా ఆడబోతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. అదే సమయంలో, వెస్టిండీస్ పర్యటనలో పని భారం దృష్ట్యా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. గాయాల కారణంగా ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఈ పర్యటనకు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన జట్లు
వన్డే జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా.
టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్కీరత్సన్ భాటియా (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!