IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
- భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్
- సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు
- బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్లో భారత్ పర్యటించాల్సి ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగ్లాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. వన్డే, టీ20 సిరీస్లను ఒక సంవత్సరానికి పైగా బీసీబీ, బీసీసీఐ వాయిదా వేశాయి. ‘రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. సెప్టెంబర్ 2026లో జరిగే ఈ సిరీస్ కోసం భారతదేశాన్ని స్వాగతించడానికి బీసీబీ ఎదురుచూస్తోంది’ అని బీసీబీ పేర్కొంది.
Also Read
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
Also Read: Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరిగిన హింస, మూకదాడులపై భారతదేశంలో నిరసనలు తీవ్రమయ్యాయి. గత 15 రోజుల్లో దీపు చంద్ర దాస్తో సహా నలుగురు హిందువులు చంపబడ్డారు. ఇటీవలి రోజుల్లో అందుకు సంబంధించిన ఫొటోస్ భారతీయులలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారతదేశంలోని ప్రముఖ మత, రాజకీయ సంస్థలు ఇందుకు వ్యతిరేకంగా నిరసనను ప్రారంభించాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు వ్యతిరేకంగా కూడా నిరసన జరుగుతోంది. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. వేలంలో రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అతడు పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!