IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
- భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్
- సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు
- బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్లో భారత్ పర్యటించాల్సి ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగ్లాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. వన్డే, టీ20 సిరీస్లను ఒక సంవత్సరానికి పైగా బీసీబీ, బీసీసీఐ వాయిదా వేశాయి. ‘రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. సెప్టెంబర్ 2026లో జరిగే ఈ సిరీస్ కోసం భారతదేశాన్ని స్వాగతించడానికి బీసీబీ ఎదురుచూస్తోంది’ అని బీసీబీ పేర్కొంది.
Also Read
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
- RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
- Shreyas Iyer: 146 మ్యాచ్ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
Also Read: Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరిగిన హింస, మూకదాడులపై భారతదేశంలో నిరసనలు తీవ్రమయ్యాయి. గత 15 రోజుల్లో దీపు చంద్ర దాస్తో సహా నలుగురు హిందువులు చంపబడ్డారు. ఇటీవలి రోజుల్లో అందుకు సంబంధించిన ఫొటోస్ భారతీయులలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారతదేశంలోని ప్రముఖ మత, రాజకీయ సంస్థలు ఇందుకు వ్యతిరేకంగా నిరసనను ప్రారంభించాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు వ్యతిరేకంగా కూడా నిరసన జరుగుతోంది. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. వేలంలో రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అతడు పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?