IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
- భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్
- సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు
- బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్లో భారత్ పర్యటించాల్సి ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగ్లాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. వన్డే, టీ20 సిరీస్లను ఒక సంవత్సరానికి పైగా బీసీబీ, బీసీసీఐ వాయిదా వేశాయి. ‘రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. సెప్టెంబర్ 2026లో జరిగే ఈ సిరీస్ కోసం భారతదేశాన్ని స్వాగతించడానికి బీసీబీ ఎదురుచూస్తోంది’ అని బీసీబీ పేర్కొంది.
Also Read
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
Also Read: Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరిగిన హింస, మూకదాడులపై భారతదేశంలో నిరసనలు తీవ్రమయ్యాయి. గత 15 రోజుల్లో దీపు చంద్ర దాస్తో సహా నలుగురు హిందువులు చంపబడ్డారు. ఇటీవలి రోజుల్లో అందుకు సంబంధించిన ఫొటోస్ భారతీయులలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారతదేశంలోని ప్రముఖ మత, రాజకీయ సంస్థలు ఇందుకు వ్యతిరేకంగా నిరసనను ప్రారంభించాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు వ్యతిరేకంగా కూడా నిరసన జరుగుతోంది. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. వేలంలో రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అతడు పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?