IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం నుంచి ప్రారంభం కానున్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్ (2027) కోసం టీమిండియా బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశమని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. జియోస్టార్ (JioStar) చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను విశ్లేషించారు.
గుర్నూర్ బ్రార్ ఎంపిక వెనుక వ్యూహం..
ఈ సిరీస్ కోసం 6 అడుగుల 5 అంగుళాల పొడవైన పేసర్ గుర్నూర్ బ్రార్ను ఎంపిక చేయడంపై పఠాన్ స్పందించారు. సౌతాఫ్రికా పిచ్లపై లభించే అదనపు పేస్, బౌన్స్ను తట్టుకునేలా బౌలర్లను సిద్ధం చేయడమే మేనేజ్మెంట్ లక్ష్యమని చెప్పారు. బ్రార్ తన ఎత్తు వల్ల సహజంగానే పిచ్ నుంచి అదనపు బౌన్స్ రాబట్టగలడని, ఇది ప్రపంచకప్ సన్నాహకాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Also Read
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
- BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లపై నమ్మకం..
షార్ట్ పిచ్ బౌలింగ్ను అద్భుతంగా ఆడే ఇషాన్ కిషన్ జట్టుకు కీలకమైన బ్యాకప్ ఆప్షన్ అని పఠాన్ కొనియాడారు. అతనికి స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడే నైపుణ్యం ఉందని.. బ్యాకప్ ఓపనర్గా, విరాట్ కోహ్లీ లేనప్పుడు నంబర్ 3 స్థానంలో, అలాగే వికెట్ కీపర్గా బహుముఖ పాత్రలు పోషించగలడని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, సౌతాఫ్రికా కండిషన్స్ కోసం నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లకు వన్డేల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
రోహిత్, విరాట్ లీడర్షిప్..
రోహిత్ శర్మ షార్ట్ పిచ్ బంతులను, పుల్ షాట్లను ఆడే విధానం అమోఘమని, సౌతాఫ్రికా పిచ్లపై అతని టైమింగ్ జట్టుకు చాలా కీలకం అవుతుందని పఠాన్ అన్నారు. ఇక వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డులే అతని ప్రతిభకు నిదర్శనమన్నారు. ఒకవేళ ప్రారంభంలోనే వికెట్లు పడినా, నంబర్ 3లో వచ్చి ఇన్నింగ్స్ను నిర్మించడంలో, ముఖ్యంగా ఛేజింగ్లో కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని పఠాన్ ప్రశంసించారు. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ జూన్ 13న ధర్మశాలలో, మిగిలిన రెండు మ్యాచ్లు జూన్ 17, 20 తేదీల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!