India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ క్రికెట్ వార్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో సహా 5 మ్యాచులకు అహ్మదాబాద్ వేదిక కాబోతోంది.
ఇదిలా ఉంటే టోర్నీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఐనా కూడా అహ్మదాబాద్ నగరంలో చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా రూమ్స్ బుక్ అవుతున్నాయి. హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా హోటల్ ధరలు రూ. 1 లక్షలను దాటాయి. హోటల్ గదుల రేట్లు దాదాపుగా 10 రెట్లు పెరిగాయి.
Also Read
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
Read Also: Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో అభిమానులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివిధ హోటల్ బుకింగ్ వెబ్సైట్లలోని రేట్లు పెరిగాయి. డిమాండ్ కారణంగా మరింతగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.
ఫైనల్తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలో భారీ క్రికెట్ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నగరంలో 10,000 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష మంది కెపాసిటీ కలిగిన నరేంద్రమోడీ స్టేడియలో 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా నగరంలోని అన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15 వరకు గదులు అందుబాటులో లేవు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ఈ పెద్ద ఈవెంట్ కోసం లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బ్లాక్ చేశారు. దీంతో లగ్జరీ హోటళ్లలో ధరలు పెరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?