India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ క్రికెట్ వార్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో సహా 5 మ్యాచులకు అహ్మదాబాద్ వేదిక కాబోతోంది.
ఇదిలా ఉంటే టోర్నీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఐనా కూడా అహ్మదాబాద్ నగరంలో చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా రూమ్స్ బుక్ అవుతున్నాయి. హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా హోటల్ ధరలు రూ. 1 లక్షలను దాటాయి. హోటల్ గదుల రేట్లు దాదాపుగా 10 రెట్లు పెరిగాయి.
Also Read
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
Read Also: Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో అభిమానులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివిధ హోటల్ బుకింగ్ వెబ్సైట్లలోని రేట్లు పెరిగాయి. డిమాండ్ కారణంగా మరింతగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.
ఫైనల్తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలో భారీ క్రికెట్ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నగరంలో 10,000 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష మంది కెపాసిటీ కలిగిన నరేంద్రమోడీ స్టేడియలో 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా నగరంలోని అన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15 వరకు గదులు అందుబాటులో లేవు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ఈ పెద్ద ఈవెంట్ కోసం లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బ్లాక్ చేశారు. దీంతో లగ్జరీ హోటళ్లలో ధరలు పెరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?