India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ క్రికెట్ వార్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో సహా 5 మ్యాచులకు అహ్మదాబాద్ వేదిక కాబోతోంది.
ఇదిలా ఉంటే టోర్నీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఐనా కూడా అహ్మదాబాద్ నగరంలో చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా రూమ్స్ బుక్ అవుతున్నాయి. హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా హోటల్ ధరలు రూ. 1 లక్షలను దాటాయి. హోటల్ గదుల రేట్లు దాదాపుగా 10 రెట్లు పెరిగాయి.
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
- Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
- Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
Read Also: Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో అభిమానులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివిధ హోటల్ బుకింగ్ వెబ్సైట్లలోని రేట్లు పెరిగాయి. డిమాండ్ కారణంగా మరింతగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.
ఫైనల్తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలో భారీ క్రికెట్ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నగరంలో 10,000 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష మంది కెపాసిటీ కలిగిన నరేంద్రమోడీ స్టేడియలో 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా నగరంలోని అన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15 వరకు గదులు అందుబాటులో లేవు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ఈ పెద్ద ఈవెంట్ కోసం లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బ్లాక్ చేశారు. దీంతో లగ్జరీ హోటళ్లలో ధరలు పెరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!