India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత గడ్డపై వన్డేసిరీస్ను క్లీన్స్విప్ చేసింది టీమిండియా… ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన… ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది.. 96 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో వెస్టిండీస్పై 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది… విండీస్ ముందు 266 పరుగుల టార్గెట్ను పెట్టింది.. అయితే, వెస్టిండీస్ చేతులేత్తేసింది.. కేవలం 169 పరుగులు మాత్రమే చేసి వికెట్లు అన్నీ సమర్పించుకుంది.. దీంతో.. 96 పరుగులతో విజయం సాధించింది.. ఇక, వెస్టిండీస్పై వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం భారత్కు ఇదే తొలిసారి కావడం మరోవిశేషం.. రోహిత్ శర్మ కెప్టెన్గా ఈ అరుదైన ఫీట్ను అందుకుంది టీమిండియా..
Read Also: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్..!
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
మూడో వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు బౌలర్లు.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చేరో రెండు వికెట్లు తమఖాతాలో వేసుకున్నారు.. దీంతో.. 266 పరుగుల ఛేదనలో విండీస్ జట్టు ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది.. ఇక, అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 265 పరుగులకు ఆలౌటైంది… శ్రేయాస్ అయ్యర్ (80), రిషబ్ పంత్ (56)తో టీమిండియా ఇన్నింగ్స్లో కీలక భూమిక పోషించారు.
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!