India vs Pakistan: కోహ్లీ ఎన్నడూ ఏడ్వలేదు.. ఇవాళ తొలిసారి ఏడ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Bhogle Interesting Tweet On Virat Kohli Innings: టీ20 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన త్రిల్లింగ్ విజయంలో విరాట్ కోహ్లీ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే! ఒకానొక దశలో భారత్ ఓడిపోతుందని భావిస్తే.. చివరివరకూ క్రీజులో నిలబడి, హార్దిక్ పాండ్యా(40) సహాయంతో జట్టుని గెలిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం.. భావోద్వేగంతో కంటితడి పెట్టాడు. ఈ దృశ్యం గురించి హర్ష భోగ్లే ట్వీట్ చేస్తూ.. ‘‘నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. ఇన్నేళ్లలో అతడు కంటతడి పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ, తొలిసారి పాక్పై విజయం సాధించిన తర్వాత ఇవాళ చూశా. ఇది ఎన్నటికీ మరువలేని సంఘటన’’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. ఈ మ్యాచ్ కోహ్లీకి ఎంత విలువైనదో ఆ కన్నీళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చని హర్ష భోగ్లే పరోక్షంగా అలా చెప్పాడు.
మరోవైపు.. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదొక అద్భుతమైన పరిణామమని, ఇలాంటి తరుణంలో తనకు మాటలు రావడం లేదని అన్నాడు. అసలు ఇది ఎలా జరిగిందో కూడా ఐడియా రావడం లేదన్నాడు. క్రీజులో ఉన్నప్పుడు మనం సాధించగలమని హార్దిక్ నమ్మాడని, చివరివరకూ క్రీజ్లో ఉంటే అది సాధ్యం అవుతుందని అనుకున్నామన్నాడు. తాము అనుకున్నదే చేసి చూపించామని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. షహీన్ షా అఫ్రిదితో పాటు హారిస్ను ఎటాక్ చేస్తే.. పాక్ ఒత్తిడికి గురవుతుందని తమకి తెలుసని, అలాగే చివరి ఓవర్ నవాజ్ వేస్తాడని కూడా ముందే ఊహించామన్నాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన సమయంలో.. రెండు సిక్స్లు కొట్టడం నిజంగా అద్భుతమన్నాడు. తన శక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచానని, హార్దిక్ కూడా చాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ఇదిలావుండగా.. టీమిండియాను ముందుండి గెలిపించడంతో విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. మైదానంలో క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ఎగిరి గంతులేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. నిన్నటిదాకా విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ‘ద కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ క్యాప్షన్ పెట్టి, కోహ్లీకి సంబంధించిన ఒక అద్భుతమైన ఫోటోని షేర్ చేసింది.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!