India vs Pakistan: కోహ్లీ ఎన్నడూ ఏడ్వలేదు.. ఇవాళ తొలిసారి ఏడ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Bhogle Interesting Tweet On Virat Kohli Innings: టీ20 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన త్రిల్లింగ్ విజయంలో విరాట్ కోహ్లీ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే! ఒకానొక దశలో భారత్ ఓడిపోతుందని భావిస్తే.. చివరివరకూ క్రీజులో నిలబడి, హార్దిక్ పాండ్యా(40) సహాయంతో జట్టుని గెలిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం.. భావోద్వేగంతో కంటితడి పెట్టాడు. ఈ దృశ్యం గురించి హర్ష భోగ్లే ట్వీట్ చేస్తూ.. ‘‘నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. ఇన్నేళ్లలో అతడు కంటతడి పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ, తొలిసారి పాక్పై విజయం సాధించిన తర్వాత ఇవాళ చూశా. ఇది ఎన్నటికీ మరువలేని సంఘటన’’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. ఈ మ్యాచ్ కోహ్లీకి ఎంత విలువైనదో ఆ కన్నీళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చని హర్ష భోగ్లే పరోక్షంగా అలా చెప్పాడు.
మరోవైపు.. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదొక అద్భుతమైన పరిణామమని, ఇలాంటి తరుణంలో తనకు మాటలు రావడం లేదని అన్నాడు. అసలు ఇది ఎలా జరిగిందో కూడా ఐడియా రావడం లేదన్నాడు. క్రీజులో ఉన్నప్పుడు మనం సాధించగలమని హార్దిక్ నమ్మాడని, చివరివరకూ క్రీజ్లో ఉంటే అది సాధ్యం అవుతుందని అనుకున్నామన్నాడు. తాము అనుకున్నదే చేసి చూపించామని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. షహీన్ షా అఫ్రిదితో పాటు హారిస్ను ఎటాక్ చేస్తే.. పాక్ ఒత్తిడికి గురవుతుందని తమకి తెలుసని, అలాగే చివరి ఓవర్ నవాజ్ వేస్తాడని కూడా ముందే ఊహించామన్నాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన సమయంలో.. రెండు సిక్స్లు కొట్టడం నిజంగా అద్భుతమన్నాడు. తన శక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచానని, హార్దిక్ కూడా చాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ఇదిలావుండగా.. టీమిండియాను ముందుండి గెలిపించడంతో విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. మైదానంలో క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ఎగిరి గంతులేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. నిన్నటిదాకా విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ‘ద కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ క్యాప్షన్ పెట్టి, కోహ్లీకి సంబంధించిన ఒక అద్భుతమైన ఫోటోని షేర్ చేసింది.
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!