KKR vs GT: కేకేఆర్పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Won The Match Against KKR: శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఛేధించింది. 17.5 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (49), విజయ్ శంకర్ (51 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (32) అద్భుతంగా రాణించడంతో.. గుజరాత్ గెలుపొందింది. చివర్లో విజయ్ శంకర్ అయితే ఊచకోత కోశాడు. తొలుత 16 బంతుల్లో 21 పరుగులే చేసిన విజయ్.. మరో 8 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతడు ఎలా చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. విజయ్ శంకర్ ఇలా విజృంభించడం వల్లే.. ఇంకా 13 బంతులు మిగిలుండగానే మ్యాచ్ గుజరాత్ కైవసం అయ్యింది.

Also Read
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్గా రికార్డు..
- Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
- BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
Drug-Resistant Bacteria: షాకింగ్ స్టడీ.. ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుర్బాజ్ (39 బంతుల్లో 81) అర్థశతకంతో చెలరేగడం, చివర్లో ఆండ్రూ రసెల్ (19 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. కేకేఆర్ ఆ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. మొదట్లో కొంచెం నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాతి నుంచి ఒక్కసారిగా విజృంభించింది. ముఖ్యంగా.. శుబ్మన్ గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సాహా మాత్రం 10 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కాసేపు క్రీజులో కుదురుకున్నట్టు కుదురుకొని.. 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా అతని వెంటే పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్.. తమ విశ్వరూపం చూపించారు.
CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
తొలుత డేవిడ్ మిల్లర్ బౌండరీల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అతడు కాస్త నెమ్మదించగానే.. విజయ్ శంకర్ విధ్వంసం సృష్టించడం స్టార్ట్ చేశాడు. ఒక దశలో గుజరాత్ గెలుపొందడానికి.. 6 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సింది. అప్పటి నుంచి వీల్లిద్దరు ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా.. 13 బంతులు మిగిలి ఉండగానే వాళ్లు లక్ష్యాన్ని ఛేధించేశారు. అంటే.. 23 బంతుల్లోనే వాళ్లిద్దరు 69 పరుగులు కొట్టేశారు. దీన్ని బట్టి.. ఏ స్థాయిలో వాళ్లిద్దరు చెలరేగి ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో విజయ్ శంకర్ అర్థశతకం పూర్తి చేసుకోవడం మరో హైలైట్ విషయం. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్, రసెల్, సునీల్ తలా వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!