Formula E-Racing: హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు.. టిక్కెట్ ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ పాస్లు, రెండు రోజుల వారాంతపు పాస్లుగా.. రెండు రకాల టికెట్లను అందుబాటులో ఉండనున్నాయి. సాధారణ పాస్ టిక్కెట్ ధర రూ.749 గా ఉండగా.. రెండు రోజుల వారాంతపు పాస్ ధర రూ. 1,249 గా నిర్వాహకులు నిర్ణయించారు.
Read Also: IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్బై
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
కాగా ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది. మొదటి, 4వ రౌండ్లు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో జరుగుతాయి. రెండు, 3వ రౌండ్లు చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరుగుతాయి. ఈ లీగ్లో ఇద్దరు భారతీయ డ్రైవర్లు, ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్లు రేసింగ్తో కూడిన ఆరు సిటీ ఆధారిత జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్ ఉంటారు. హైదరాబాద్లో జరిగే ఈవెంట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈవో దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రేస్కు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!