FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
- ప్రపంచకప్ మహా సమరం ప్రారంభానికి రంగం సిద్ధం
- చరిత్రలో తొలిసారి మూడు దేశాల ఆతిథ్యం
- టైటిల్ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్ పోటీ
- విజేతలకు భారీ ప్రైజ్మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Begins: ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మహా సమరం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మన దేశ జట్టు ఈ టోర్నీలో లేకపోయినా, భారత ఆటగాళ్లు బరిలో లేకపోయినా.. ఫుట్బాల్ అందించే ఉత్కంఠ, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంటుంది. స్టార్ ఆటగాళ్ల అద్భుత నైపుణ్యం, మెరుపు వేగంతో సాగే మ్యాచ్లు, అద్భుత గోల్స్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి.
గురువారం (జూన్ 11) నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమార్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా తమ ప్రతిభను చాటుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. ఈసారి ప్రపంచకప్ అనేక కొత్త రికార్డులకు వేదిక కానుంది. చరిత్రలో తొలిసారిగా 48 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గత ఎడిషన్లో 32 జట్లు మాత్రమే పోటీపడగా.. ఇప్పుడు జట్ల సంఖ్య పెరగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
టోర్నీకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు మొత్తం 39 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్లు 16 నగరాల్లో నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూపులుగా విభజించి లీగ్ దశ మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రస్తుత టోర్నీలో అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్ విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో అర్జెంటీనా సిద్ధమవుతోంది. అయితే ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈసారి ప్రపంచకప్లో పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈసారి ప్రపంచకప్లో పాల్గొనే జట్లకు భారీ స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించారు. ఛాంపియన్ జట్టుకు రూ. 476 కోట్లు.. రన్నరప్ జట్టుకు రూ. 314 కోట్లు అందనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 276 కోట్లు ప్రైజ్మనీ దక్కుతుంది. భారీ బహుమతి మొత్తం, ప్రపంచ స్థాయి పోటీ, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనతో ఈసారి ఫుట్బాల్ ప్రపంచకప్ అభిమానులకు మరపురాని క్రీడా విందుగా మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ మహా టోర్నీపైనే నిలిచింది. అయితే భారత్ లేకపోవడం మనకు కాస్త నిరాశే అని చెప్పాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!