IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది పలికారు. అయితే రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారీ లక్ష్యంలా కనిపించిన టార్గెట్ కర్పూరంలా కరిగిపోయింది.
Read Also: Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్ల నుంచి టీమిండియా కెప్టెన్కు సహకారం లభించలేదు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 416 పరుగులు చేయగా ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తడబాటుకు గురైంది. శుభ్మన్ గిల్ (4), హనుమా విహారి (11), విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యారు. అయితే చతేశ్వర్ పుజారా (66), పంత్ (57) రాణించడంతో కోలుకున్నట్లు కనిపించిన భారత్ వాళ్లిద్దరూ అవుట్ కాగానే వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (19), జడేజా (23) శార్దూల్ ఠాకూర్ (4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో 284 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 378 పరుగుల టార్గెట్ నిలిచింది. కాగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. దీంతో 2007 తర్వాత ఇంగ్లండ్లో సిరీస్ గెలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..