BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు మ్యాచ్లు తప్పక ఆడాల్సిందే!
- బీసీసీఐ కీలక నిర్ణయం
- విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు తప్పక ఆడాల్సిందే
- దేశవాళీ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ప్లేయర్స్ అందరూ 2025 విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని టీమిండియా ప్లేయర్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ డిసెంబర్ 19న ముగుస్తుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది. అంటే భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం లబిస్తుంది. ఈ విరామంలో భారత ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు. ఓ ప్లేయర్ ఫిట్గా లేడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటిస్తే.. సదరు ఆటగాడికి మినహాయింపు ఉంటుంది.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
Also Read: Lionel Messi: భారత్కు మళ్లీ రావడం పక్కా.. మెస్సీ భావోద్వేగం!
డిసెంబర్ 24 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ మొదలయ్యేనాటికి విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో జట్టు ఆరు మ్యాచ్లు ఆడేలా బీసీసీఐ షెడ్యూల్ చేసింది. ఏ రెండు మ్యాచ్లు ఆడాలనుకునేది ఆటగాళ్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో కచ్చితంగా ఆడాలని ఆటగాళ్లకు చెప్పామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరి ఓ జాతీయ మీడియాతో చెప్పారు.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?