భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ప్లేయర్స్ అందరూ 2025 విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని టీమిండియా ప్లేయర్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.…