Kohli-Rohit-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- డిసెంబర్ 22న బీసీసీఐ కీలక సమావేశం
- రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- శుభ్మాన్ గిల్ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల విషయంపై కూడా ఏజీఎం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది 31వ వార్షిక సర్వసభ్య సమావేశం. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి ఏజీఎం. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను A+ గ్రేడ్ నుంచి తొలగించి.. A కేటగిరీలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. రో-కోను A కేటగిరీలో ఉంచితే.. వారి వార్షిక వేతనంలో రూ.2 కోట్లు తగ్గుతుంది. ప్రస్తుతం వార్షిక వేతనాలు రూ.7 కోట్లు (A+), రూ.5 కోట్లు (A), రూ.3 కోట్లు (B), రూ.1 కోటి (C)గా ఉన్నాయి. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మాన్ గిల్ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. A+లో ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు ఉన్నారు.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
Also Read: 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్తో వస్తున్న Redmi Note 15!
ప్రస్తుతం A కేటగిరీలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈఏడాది కాలంగా ఆడని షమీ కేటగిరీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ Bలో ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు C కేటగిరీలో ఉన్నారు. ఆన్లైన్లో జరగనున్న ఏజీఎంలో అంపైర్లు, రిఫరీల వేతనాలపై కూడా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!