Kohli-Rohit-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- డిసెంబర్ 22న బీసీసీఐ కీలక సమావేశం
- రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- శుభ్మాన్ గిల్ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల విషయంపై కూడా ఏజీఎం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది 31వ వార్షిక సర్వసభ్య సమావేశం. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి ఏజీఎం. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను A+ గ్రేడ్ నుంచి తొలగించి.. A కేటగిరీలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. రో-కోను A కేటగిరీలో ఉంచితే.. వారి వార్షిక వేతనంలో రూ.2 కోట్లు తగ్గుతుంది. ప్రస్తుతం వార్షిక వేతనాలు రూ.7 కోట్లు (A+), రూ.5 కోట్లు (A), రూ.3 కోట్లు (B), రూ.1 కోటి (C)గా ఉన్నాయి. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మాన్ గిల్ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. A+లో ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు ఉన్నారు.
Also Read
- LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
Also Read: 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్తో వస్తున్న Redmi Note 15!
ప్రస్తుతం A కేటగిరీలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈఏడాది కాలంగా ఆడని షమీ కేటగిరీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ Bలో ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు C కేటగిరీలో ఉన్నారు. ఆన్లైన్లో జరగనున్న ఏజీఎంలో అంపైర్లు, రిఫరీల వేతనాలపై కూడా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!