Asia Cup 2023: పంతం నెగ్గిన పాకిస్తాన్.. అందుకు ఏసీసీ పచ్చజెండా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cricket Council Gives Green Signal For Hybrid Model For Asia Cup 2023: ఆసియా కప్ 2023 నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్లో అడుగుపెట్టదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పడంతో.. హైబ్రిడ్ మోడల్ని పాక్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే! అందుకు తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లోనూ, భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలోనూ నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది.
Rohit Sharma: అదే మా కొంపముంచింది.. ఓటమిపై రోహిత్ రియాక్షన్
Also Read
- FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
- 2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
ఈ ఆసియా కప్ 2023లో భాగంగా.. మొత్తం 13 మ్యాచ్లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. ఆ మొత్తం మ్యాచ్ల్లో నుంచి కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్లే పాక్లో జరిగే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్లతో పాటు భారత్ ఆడే మిగతా మ్యాచ్లు అన్నీ.. శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే, అది కూడా శ్రీలంకలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇదే సమయంలో.. ఈ టోర్నీలో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని తేలింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా.. సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే.. ఈ ఆసియా కప్ విషయమై అధికారక ప్రకటన రానుంది.
CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు
నిజానికి.. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్కే ‘ఆసియా కప్ 2023’ నిర్వహణ హక్కులు దక్కాయి. అయితే.. భారత్, పాక్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో.. భారత జట్టును పాక్కు పంపిచేందుకు బీసీసీఐ నిరాకరించింది. మరో దారి లేక.. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. ఇందుకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు మాత్రం అక్కడ ఎండలు మండిపోతాయని చెప్పి, ఆ ప్రతిపాదనని నిరాకరించాయి. ఫైనల్గా ఏసీసీ శ్రీలంక పేరుని ప్రసాదించగా.. అందుకు అన్ని దేశాలు సమ్మతమేనని చెప్పాయి.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!