Asia Cup 2023: పంతం నెగ్గిన పాకిస్తాన్.. అందుకు ఏసీసీ పచ్చజెండా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cricket Council Gives Green Signal For Hybrid Model For Asia Cup 2023: ఆసియా కప్ 2023 నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్లో అడుగుపెట్టదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పడంతో.. హైబ్రిడ్ మోడల్ని పాక్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే! అందుకు తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లోనూ, భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలోనూ నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది.
Rohit Sharma: అదే మా కొంపముంచింది.. ఓటమిపై రోహిత్ రియాక్షన్
Also Read
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ఈ ఆసియా కప్ 2023లో భాగంగా.. మొత్తం 13 మ్యాచ్లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. ఆ మొత్తం మ్యాచ్ల్లో నుంచి కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్లే పాక్లో జరిగే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్లతో పాటు భారత్ ఆడే మిగతా మ్యాచ్లు అన్నీ.. శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే, అది కూడా శ్రీలంకలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇదే సమయంలో.. ఈ టోర్నీలో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని తేలింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా.. సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే.. ఈ ఆసియా కప్ విషయమై అధికారక ప్రకటన రానుంది.
CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు
నిజానికి.. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్కే ‘ఆసియా కప్ 2023’ నిర్వహణ హక్కులు దక్కాయి. అయితే.. భారత్, పాక్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో.. భారత జట్టును పాక్కు పంపిచేందుకు బీసీసీఐ నిరాకరించింది. మరో దారి లేక.. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. ఇందుకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు మాత్రం అక్కడ ఎండలు మండిపోతాయని చెప్పి, ఆ ప్రతిపాదనని నిరాకరించాయి. ఫైనల్గా ఏసీసీ శ్రీలంక పేరుని ప్రసాదించగా.. అందుకు అన్ని దేశాలు సమ్మతమేనని చెప్పాయి.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!