Rohit Sharma: అదే మా కొంపముంచింది.. ఓటమిపై రోహిత్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma On Losing WTC Final Against Australia: భారత క్రీడాభిమానులు ఏదైతే భయపడ్డారో.. అదే జరిగింది. ఎప్పట్లాగే ఈసారి కూడా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చేతులెత్తేసింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా రన్నరప్కే పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ విభాగం విఫలమవ్వడం, దాంతో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించడమే.. తమ కొంపముంచిందని పేర్కొన్నాడు. తాము గెలిచేందుకు గట్టిగా ప్రయత్నించాం కానీ, దురదృష్టవశాత్తూ ఓడిపోయామని చెప్పుకొచ్చాడు.
Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
Also Read
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
- Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
- Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి, ఆస్ట్రేలియాను కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్కి దించడంతో, మేము బాగానే ప్రారంభించామని నేను అనుకున్నారు. తొలిరోజు ఆటలో భాగంగా.. మొదటి సెషన్లో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. కానీ.. ఆ తర్వాతి సెషన్ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. ఇందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మ్యాచ్పై పట్టు చిక్కిందనుకున్న సమయంలో.. ట్రెవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్లు అద్భుతంగా ఆడారు. వారి భాగస్వామ్యం ఆస్ట్రేలియాను ముందంజలో ఉంచింది. ఒక రకంగా చెప్పాలంటే.. తొలి ఇన్నింగ్స్లో వాళ్లు చేసిన పరుగులతోనే, ఆస్ట్రేలియా సగం విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు మేము సాయశక్తులా ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలో భాగంగా.. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను త్వరగా ఔట్ చేయాలని అనుకున్నాం. అందులో మేము సక్సెస్ కూడా అయ్యాం’’ అని వెల్లడించాడు.
Tamil Nadu: ఆర్మీ జవాన్ భార్యపై 40 మంది దాడి.. అసభ్య ప్రవర్తన
కానీ.. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం కలిసొచ్చిందని, అదే తమ కొంపముంచిందని రోహిత్ తెలిపాడు. తమ బ్యాటింగ్ విభాగం బాగానే ఉందనుకుంటున్నానని, కాకపోతే కీలక సమయంలో విఫలమయ్యాయని పేర్కొన్నాడు. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్ ఆడామంటే.. తమ ఆట బాగానే ఉందని అర్థమని చెప్పుకొచ్చాడు. ఈ ఫైనల్ కోసం తాము రెండేళ్లు పాటు కష్టపడ్డామని, వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి ఫైనల్ దాకా చేరుకున్నామని, కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు తమకు బాగా మద్దతిచ్చారని, ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు. ఇది తమకు ఓ గుణపాఠమన్న రోహిత్.. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మరింత స్ట్రాంగ్గా వస్తామని అన్నాడు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!