Kolkata Knight Riders: కోల్కతా నైట్ రైడర్స్కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Big Blow To Karnataka Knight Riders: ఓవైపు ఐపీఎల్ 2023 సీజన్ సమీపిస్తుంటే.. మరోవైపు ఆయా జట్లకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అనుకోని కారణాల వల్ల ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైటర్స్కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే వెన్ను సమస్య కారణంగా శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ సీజన్కు దూరం కాబోతున్నారని సమాచారం. వాళ్లే.. నితీష్ రానా, లోకీ ఫెర్గ్యూసన్.
Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
Also Read
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
- Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
- Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
కోల్కతా ఆటగాళ్లలో నితీష్ రానా కీలక ఆటగాడు. ఇతడు పరుగుల వర్షం కురిపించడంలో దిట్ట. జట్టు సమస్యల్లో ఉన్న ప్రతీసారి.. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ, గట్టెక్కిస్తుంటాడు. ఇతడు ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్ కారణంగా.. కోల్కతా విజయతీరాలకు చేరిన సందర్భాలున్నాయి. అయితే.. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రానా యాంకిల్ (చీలమండ)కు గాయమైనట్లు తేలింది. దీంతో ఇతగాడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక స్టార్ బౌలర్ ఫెర్గ్యూసన్ విషయానికొస్తే.. ఇతడు కూడా గాయం (హ్యామ్స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్కు ముందు అతనికి గాయం కావడంతో.. తొలి వన్డేకు అతడు దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. ఒకవేళ ఇతనికి అయిన గాయం తీవ్రమైతే మాత్రం.. ఐపీఎల్కి దూరం కావొచ్చు.
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
అయితే.. ఫెర్గూసన్ గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గానీ, కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ అతనికైన గాయం చిన్నదే అయితే.. ఐపీఎల్లో తప్పకుండా పాల్గొంటాడు. ఏదేమైనా.. ముగ్గురు ఆటగాళ్లకు ఇలా గాయాల బారిన పడటంతో, కేకేఆర్ యాజమాన్యం ఆందోళనలో పడింది. కాగా.. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం అవుతుండగా, కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్ 2న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!