Kolkata Knight Riders: కోల్కతా నైట్ రైడర్స్కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Big Blow To Karnataka Knight Riders: ఓవైపు ఐపీఎల్ 2023 సీజన్ సమీపిస్తుంటే.. మరోవైపు ఆయా జట్లకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అనుకోని కారణాల వల్ల ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైటర్స్కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే వెన్ను సమస్య కారణంగా శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ సీజన్కు దూరం కాబోతున్నారని సమాచారం. వాళ్లే.. నితీష్ రానా, లోకీ ఫెర్గ్యూసన్.
Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కోల్కతా ఆటగాళ్లలో నితీష్ రానా కీలక ఆటగాడు. ఇతడు పరుగుల వర్షం కురిపించడంలో దిట్ట. జట్టు సమస్యల్లో ఉన్న ప్రతీసారి.. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ, గట్టెక్కిస్తుంటాడు. ఇతడు ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్ కారణంగా.. కోల్కతా విజయతీరాలకు చేరిన సందర్భాలున్నాయి. అయితే.. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రానా యాంకిల్ (చీలమండ)కు గాయమైనట్లు తేలింది. దీంతో ఇతగాడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక స్టార్ బౌలర్ ఫెర్గ్యూసన్ విషయానికొస్తే.. ఇతడు కూడా గాయం (హ్యామ్స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్కు ముందు అతనికి గాయం కావడంతో.. తొలి వన్డేకు అతడు దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. ఒకవేళ ఇతనికి అయిన గాయం తీవ్రమైతే మాత్రం.. ఐపీఎల్కి దూరం కావొచ్చు.
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
అయితే.. ఫెర్గూసన్ గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గానీ, కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ అతనికైన గాయం చిన్నదే అయితే.. ఐపీఎల్లో తప్పకుండా పాల్గొంటాడు. ఏదేమైనా.. ముగ్గురు ఆటగాళ్లకు ఇలా గాయాల బారిన పడటంతో, కేకేఆర్ యాజమాన్యం ఆందోళనలో పడింది. కాగా.. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం అవుతుండగా, కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్ 2న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!