T20 World Cup: పాకిస్థాన్ను ఊరిస్తున్న 1992 ప్రపంచకప్ సెంటిమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ సోషల్ మీడియాను ఊదరగొడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Also: టీ20 ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్లలో ఆధిపత్యం ఎవరిది?
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
1992 వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరిగింది. అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. అప్పటి సెమీస్ రేసుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేరుకోగా.. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ మూడు జట్లు సెమీస్ చేరుకోవడం పాకిస్థాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రపంచకప్లో కూడా ఆతిథ్య ఆస్ట్రేలియా నాకౌట్ చేరకుండానే వెనుదిరగడం వంటి పరిస్థితులు చూస్తుంటే ఫైనల్లో ఇంగ్లండ్ లేదా టీమిండియాను ఓడించి పాకిస్థాన్ 1992 ప్రపంచకప్ రిపీట్ చేస్తుందని ఆ జట్టు అభిమానులు సంబరపడుతున్నారు. అప్పుడు కూడా ఒక్క పాయింట్ తేడాతో పాకిస్థాన్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుందని.. ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాకు, పాకిస్థాన్కు ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉండటంతో ఆ జట్టును అధిగమించి సెమీస్కు వెళ్లడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.
Pakistan at the 1992 ODI World Cup 🤝 Pakistan at the 2022 T20I World Cup pic.twitter.com/aDvZfN5XTR
— ESPNcricinfo (@ESPNcricinfo) November 7, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!