India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies: వెస్టిండీస్తో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ రెండు సిరీస్ల కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక జట్లను ఎంపిక చేసింది. అయితే ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం రిషభ్ పంత్. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో పంత్ మళ్లీ జట్టులోకి వస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్కు షాకిస్తూ, ధ్రువ్ జురెల్ వైపే మొగ్గు చూపారు. భారత జట్టులో చోటు దక్కకపోవడంతో, పంత్ రాబోయే ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక మరోవైపు యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బంపర్ ఆఫర్ తగిలింది. మొదట ఆసియా క్రీడల జట్టులో స్థానం పొందిన నితీష్ను, అక్కడ నుంచి తప్పించి ఏకంగా సీనియర్ వన్డే జట్టులోకి ప్రమోట్ చేశారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతోనే నితీష్ను వన్డేల్లోకి తీసుకున్నట్లు సమాచారం.
వన్డే సిరీస్లో భారత జట్టుకు శుబ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా, వైస్ కెప్టెన్గా కెఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు టీ20 సిరీస్ విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. టీ20 జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పాటు వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. అలాగే శివం దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లు ఈ పొట్టి ఫార్మాట్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
భారత వన్డే జట్టు..
శుభ్మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (విసి), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఔకిబ్ నబీ, యశస్వి డి జైస్వాల్.
భారత టీ20ఐ జట్టు
శ్రేయాస్ అయ్యర్ (C), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్ (WK), తిలక్ వర్మ (VC), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ మే కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, సింఘన్ యాదవ్, అర్ష్దీప్ సింఘన్ రెడ్డి.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!